December

విద్యపైWTOఒత్తిళ్లకు లొంగొద్దు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపైన, డబ్ల్యూటిఓ మంత్రుల సమావేశం ముందుకు తెస్తున్న వినాశకర విధానాలపైన సమర భేరి మోగిస్తూ బుధవారం నాడు భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ), అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎఐఎస్‌ఎఫ్‌), అలిండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌(ఎఐడిఎస్‌ఓ) సంఘాలు ఉమ్మడిగా ఆందోళన నిర్వహించాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. విద్యా వ్యతిరేక విధానాలు నశించాలి, డబ్ల్యూటిఓ గో బ్యాక్‌, ఫెలోషిప్స్‌ అందరికీ ఇవ్వాలని ప్రదర్శకులు నినదించారు.

మత సామరస్యం కోరుతూ కరపత్రాల పంపిణీ

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకే ఇటీవల అస హన ధోరణులు, దాడులు పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిన్నతంపై మతోన్మాద దాడులు, అసహన ధోరణు లకు నిరసనగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోనూ సిపిఎం ప్రచార యాత్ర లు నిర్వహిస్తోంది. అందులోభాగంగా బుధవారం శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు నిర్వహించారు. అసహన ధోరణులకు వ్యతిరేకంగా, మత సామరస్యం కోరుతూ సిపిఎం శ్రీకాకుళం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాయివీధిలో మతసామరస్యంపై కరపత్రాలను పంపిణీ చేశారు.

Pages

Subscribe to RSS - December