ఈ రోజు (28-9-2015)న మధ్యాహ్నాం పరవాడ జవహర్లాల్ ఫార్మాసిటీలో సాయినార్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందగా, మరో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. గాయపడిన క్షతగాత్రులను విశాఖలోని న్యూ కేర్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్, అధ్యక్షులు జి.కోటేశ్వరరావు.
ఈ ఘటనపై సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం మాట్లాడుతూ ఫార్మా కంపెనీల్లో కనీస భద్రతా చర్యలు కూడా పాటించకుండా అధిక ఉత్పత్తికి అధికవత్తిడి పెట్టడడమే ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తున్నది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా...