హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించాయని, తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి వ్యాధులను అరికట్టే చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిపిఎం ప్రజారోగ్య కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజారోగ్య రాష్ట్ర కమిటీ సభ్యులు టి.కామేశ్వరరావు, బిఎల్‌ నారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 13వేల మలేరియా కేసులు నమోదు కాగా, ఒక్క విశాఖలోనే 7210 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు.రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు. డెంగ్యూ కేసులు ఒక్క చిత్తూరు జిల్లాలోనే 700కు పైగా నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4లక్షలకు పైగా డయేరియా బాధితులున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని తెలిపారు. ఇంత పెద్దఎత్తున వ్యాధులు ప్రబలినా ఏం చర్యలు ప్రభుత్వం తీసుకుందని ప్రశ్నించారు.