District News

దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడూతూ మిర్చి రంగంలో షుమారు 20 వేల మందికిపైగా పనిచేస్తున్నా కష్టానికి తగ్గకూలీ, ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలో పని చేసే...

రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలకే అప్పగించాలంటే అందుకు ప్రతిగా అవి వాటికోసం కోరుకున్న భూములనూ సర్వ హక్కులతోనూ ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. కంపెనీల షరతులు:తమకు కేటాయించే భూములపై పూర్తి హక్కులూ తమకే అప్పగించాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవని రాజధాని నిర్మాణం చేపట్టదలచిన కంపెనీలు తెలిపినట్లు తెలిసింది. 99 సంవత్సరాల లీజు పద్ధతిలో ఇచ్చినా భూమిపై హక్కులు తమకే ఉండాలని, అందుకు అవసరమైన డాక్యుమెంట్లున్నీ అప్పగించాలని సింగపూర్‌ ప్రతినిధులు షరతు పెట్టినట్లు సమాచారం. రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వడానికి వీలులేని పద్ధతిలో అగ్రిమెంట్లు చేయించుకుంటున్న ప్రభుత్వం వాటినే...

 రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు రైతుల నుంచి గుంజుకొని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే యత్నాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. గురువారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరుతో 53 వేల ఎకరాలు సేకరించాలని 45 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని కోసం మొత్తం 1.40 లక్షల ఎకరాల భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. దేశం వ్యవసాయక దేశమని, 120 కోట్ల జనాభాకు ఆహార పదార్ధాలు అందించాల్సిన గురుతర...

కేంద్ర పర్యాటకా ప్రాజెక్టుల కోసం ధరణికోట సత్తెనపల్లి రోడ్డులో ప్రభుత్వం 50 ఎకరాల భూ సేకరణ చేపడుతుందనే వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించడంతో అమరావతిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల ధరలు ఎకరం సుమారు రూ.4 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రభుత్వం భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే 30 లక్షల కంటే మించి పరిహారం వచ్చే అవకాశాలు లేకపోవడంతో భూ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని వారసత్వ నగరంగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడంతో అమరావతి అభివృద్ధికి భూమిని సేకరించి పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇటీవల...

ప్రభుత్వ బలవంతపు భూసేకరణను నిరసిస్తూ రాజధాని ప్రాంతం పెనుమాక రైతులతో వామపక్ష్య నాయకులు సమావేశమయ్యారు.ఈసమావేశానికి రైతులు భారీగా  తరలివచ్చారు.ఎలాంటి పరిస్థితిలో భూములు ఇచ్చేది లేదని రైతులు తేగేసి చెప్పారు. సిపియం రాష్ర్ట కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ప్రభుత్వం చేయడం సిగ్గుచెటన్నారు.ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవాలని చూస్తే రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రాజధాని ప్రాంతం నుండి పేదలను, దళితులను తరిమివేసేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలకు వ్యతిరేకంగా పేదలంతా ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి రైట్స్‌ అండ్‌ యాక్ట్స్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లో శుక్రవారం దళిత దీక్ష జరిగింది. ఈ దీక్షను బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎస్‌డిఈ దుంగా రత్నప్రదీప్‌ ప్రారంభించారు. దీక్షనుద్దేశించి రవి మాట్లాడుతూ రాజధానిలో దళితులకు స్థానం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దళితుల పట్ల పాలకులు వివక్షత చూపుతున్నారని దళితులుగా ఉన్న అసైన్డ్‌ సాగుదారులకు కౌలు చెక్కులు ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు...

దేశంలో అమలవుతున్న సరళీకరణ విధానాల ద్వారా వ్వవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారంబ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం లో ఎపిరైతుసంఘం, వ్వవసాయక ార్మికసంఘం సంయుక్త అధ్వర్యంలో రైతుసంఘంజిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన రౌండ్‌టెబుల్‌ సమావేశం నిర్వహించారు. వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయని, వ్వవసాయ పనులు లేక రైతులు, రైతుకూలీలు, వలసలు వెళ్తున్నారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తూట్లు పోడుస్తున్నాయని విమర్శించారు. .రైతుల భూములను లాక్కోవటం కోసమే 2013 భూసేకరణ చట్టాన్ని మార్పుచేస్తూ మోడీ ప్రభుత్వం...

రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు తాత్కాలికంగా స్వస్థిపలుకుతూ సమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20న జారీ చేసిన నోటిఫికేషన్లను నిలిపివేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది. సిఆర్‌డిఎ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ప్రకాశం బ్యారేజిపై రాస్తారోకో, నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వం చర్యలకు నిరసనగా ప్రజలను సమాయత్త పరచటంలో సిపిఎం గత కొంత కాలంగా పోరుబాట నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలో గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, నిఘావర్గాలు హెచ్చరించటం, అంశాంతి వాతావరణం మధ్య రాజధాని నిర్మాణం ముందుకు సాగదని భావించిన ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రభుత్వానికి...

 ప్రభుత్వం ప్రయివేట్‌ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.లక్ష్మణరావు ఆరోపించారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ శనివారం విజయవాడలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రయివేట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయటం కోసం కేబినెట్‌ చర్చించి ఆమోదం తెలిపిందన్నారు. దీనిని ఎస్‌ఎఫ్‌ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జిల్లాకి ఒక ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా ప్రయివేట్‌ యూని వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలపటం సరైన విధానం కాదన్నారు. ప్రయివేట్...

 'నా రెక్కలు విరవని నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు' అని చెప్పిన స్వేచ్ఛాజీవి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జారు మహిళా విద్యకు, ప్రపంచశాంతికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. మలాలాను, ఆమె తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. స్థానిక వింజనంపాడులోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంయుక్తంగా కళాశాలలో శుక్రవారం మలాలా స్వీయ గాధను తెలియచేస్తూ ' నేను మలాలా' పేరుతో ముద్రించిన పుస్తకాన్ని వేలాది మంది విద్యార్థులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాశాల చైర్మన్‌ కోయ సుబ్బారావు అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ సాహితీ వేత్త, నాగార్జునా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌...

Pages