2016

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాలి.

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన,వినాశ‌క‌ర‌మైన‌,ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించే  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాల‌ని సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి డిమాంఢ్ చేసారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు వ్య‌తిరేకంగా సిపియం ప్ర‌జాసంఘాల ఆద్వ‌ర్య‌ములో  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్ర‌భావిత గ్రామాల‌లోప‌ర్య‌టించారు.సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌ని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓల‌ను ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసారు.

నీరుగారుతున్న గృహ నిర్మాణం..

గుడిసెలులేని ఆంధ్రప్రదేశ్‌, పేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, 2022 నాటికి అందరికీ ఇళ్ళు అంటూ పాలకులు ఊదరగొడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి. గృహనిర్మాణ పథకాల పేర్లు మారాయి. ఇందిరమ్మ, రాజీవ్‌ పథకాల స్థానంలో ఎన్‌టిఆర్‌ పథకాలొచ్చాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. 22 నెలలు గడచినా తెలుగుదేశం, బిజెపి పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు, మధ్యతరగతివారికి ప్రత్యేక గృహ పథకం పేరుతో వాగ్దానాల వర్షం కురిపించింది. ఈ కాలంలో ''గాలిమేడలే'' తప్ప ఇళ్ళ నిర్మాణం సాగలేదు.

ఉన్నత విద్యామండలి వివాదంపై సుప్రీం..

ఉన్నత విద్యా మండలిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య వాటాలు 52:48 నిష్పత్తిలో జరగాలని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఖాతాల్లో ఇరు రాష్ట్రాలకు వాటా వుంటుందని స్పష్టం చేసింది. జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఉన్నత విద్యామండలి కేసులో శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

JNU ఉమర్‌,అనిర్బన్‌లకు బెయిల్‌..

రాజద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న జేఎన్‌యూ రీసెర్చ్‌ స్కాలర్లు ఉమర్‌ ఖాలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలకు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ 6 నెలల పాటు అమలులో ఉంటుంది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా 'దేశ వ్యతిరేక' నినాదాలు చేశారన్న ఆరోపణలపై వారిని గత నెలలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అదనపు సెషన్స్‌ జడ్జి రీతీశ్‌సింగ్‌ ఇద్దరు స్కాలర్లను రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో జామీను ఇవ్వాలని ఆదేశిం చారు.

చిన్నపొదుపు మొత్తాల వడ్డీరేట్లపై కోత..

చిన్న పొదుపు మొత్తాల పథకాల వడ్డీరేట్లపై కోతపడింది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌ పత్ర (కేవీపీ), సీనియర్‌ సిటిజెన్ల డిపాజిట్లు సహా పలు పథకాలపై చెల్లించే వడ్డీరేట్లను ప్రభుత్వం తగ్గించి వేసింది. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 మధ్య కాలానికి పీపీఎఫ్‌పై వడ్డీరేటును ప్రస్తుతమున్న 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది.

పిల్లల చదువు బాధ్యత కార్పొరేట్లదేనట..!

త్రివిధ దళాలు, పోలీసు, పారా మిలిటరీ బలగాల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాల పిల్లల చదువు సంధ్యల బాధ్యతను కార్పొరేట్‌ రంగం తీసుకోవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీర జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు ఆ రంగంలోని వారంతా చేతులు కలపాలిలని కేంద్ర హోం మంత్రి రాజనాథ్ వ్యాఖ్యానించారు..

 

2020 కల్లా భారత పరిశ్రమలపై 665 కోట్లు

వివిధ ప్రభుత్వ పథకాల్లో కంపెనీ పాత్రపై చర్చించడం కోసం అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో ఛైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శుక్రవారమిక్కడ కలిశారు. 2020 కల్లా భారత అంకుర పరిశ్రమలపై 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సిస్కో ప్రకటించింది. అంతే కాకుండా 2.5 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లూ తెలిపింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై BJP కసరత్తు

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే భేటీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్లు పాల్గొంటున్నారు. నేషనల్ ఎగ్జిక్యూట్‌మెంట్ మీట్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. 

ఏప్రిల్‌ 2 రావాల్సిందిగా మాల్యాకు సమన్లు

తనకు మరింత గడువు ఇవ్వాలన్న విజయ్‌ మాల్యా విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మన్నించింది. దర్యాప్తు అధికారి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు గడువు పెంచింది. ఏప్రిల్‌ 2న రమ్మని తాజాగా సమన్లు జారీ చేసింది. అంతక్రితం సమన్ల ప్రకారం శుక్రవారమే (ఈనెల 18న) మాల్యా హాజరుకావాల్సి ఉంది. 

అమరావతిలో అత్యుత్తమ హైకోర్టు..

 అమరావతిలో ప్రపంచ అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సు ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు, ధర్మాసనాలు ఇచ్చే తీర్పులు సమాజానికి మార్గదర్శకాలు అని చంద్రబాబు అన్నారు

Pages

Subscribe to RSS - 2016