2016

టెక్నాలజీ మాటున మోడీ హిందూత్వం..

రాజ్యాంగంలో మనువాద భావజాలాన్ని జొప్పించి దేశాన్ని మరో పాకిస్థాన్‌గా మార్చేందుకు నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు విమర్శించారు. మనువాదాన్ని అమలు చేసిన మరుసటి రోజే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ు పరివారాన్ని ప్రజలు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానం మాటున హిందూత్వాన్ని ప్రజ లపై రుద్ది దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు మోడీ యత్నిస్తున్నారని ఆరోపించారు.

జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలి

విశాఖ మన్యంలోని బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.  చంద్రబాబునాయుడు బాక్సైట్‌ విషయంలో కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జిఒలను రద్దు చేసి తను జారీ చేసిన జిఒ 97ను మాత్రం రద్దు చేయడం లేదని తెలిపారు. ఏదైనా జిఒ జారీ అయితే ఐదేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత ఆ జిఒ ఆటోమెటిక్‌గా రద్దవుతుందని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

వారికి అంబేద్కర్‌ అవసరం ఎందుకొచ్చింది?

అంబేద్కర్‌ గురించి అంద రూ మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అని, దళిత వర్గా ల పెన్నిధి అని కీర్తిస్తు న్నారు. రిజ ర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల హక్కు అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాజాగా ప్రస్తుతించారు. అంబే ద్కర్‌ను ఇప్పుడు జాతీయ పార్టీలు అన్నీ సొంతం చేసుకునే దిశలో పోటీపడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బిజెపి ఈ విషయంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అంబేద్కర్‌ పేరు చెప్పి ఓట్లు పొందే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందుకే సమయం వచ్చినప్పుడే కాకుండా అంబేద్కర్‌ పేరు చెప్పడానికి సమయం కొనితెచ్చుకుంటున్నారు.

రాష్ట్రాల్లో కమల నాధుల అభివృద్ధి టూర్‌

ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి అజెండా ప్రచారానికి పార్టీ కూడా కృషిచేసేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు పార్టీ బృందాన్ని పంపాలని నిర్ణయించారు. పార్టీలో ఆర్‌ఎ్‌సఎస్‌ నియమించే ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) రామ్‌లాల్‌ ఈ బృందంలో కీలక సభ్యుడు. మిగతా సభ్యులు కూడా దాదాపు సంఘ్‌ నుంచి వచ్చినవారే ఉంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. వీరు తరచూ రాష్ట్రాలకు వెళ్లి కనీసం మూడు రోజులు గడుపుతారు. ‘నాయకత్వ ఆలోచనలకు, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు మధ్య అంతరం ఉండకూడదని అమిత షా భావిస్తున్నారు. 

JNU గూగుల్‌మ్యాప్ వివాదం RSS కుట్రే..

దేశవ్యతిరేకత,రాజద్రోహం వంటి పదాల ఆధారంగా గూగుల్‌మ్యాప్స్‌లో వెతికితే దిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) కనిపించటం శుక్రవారం వివాదాన్ని సృష్టించింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర అని జేఎన్‌యూ విద్యార్థిసంఘం ఉపాధ్యక్షురాలు షేలా రషీద్‌ షోరా ఆరోపించారు. జేఎన్‌యూకు సంబంధించిన గూగుల్‌మ్యాప్స్‌ రివ్యూలను దేశవ్యతిరేకత, ఉగ్రవాదం వంటి పదాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు పెద్దఎత్తున అనుసంధానించటం వల్లే ఇది జరిగిందన్నారు. 

APలో విద్యుత్ చార్జీల మోత దారుణం..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు దారుణంగా పెంచుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం సరికాదన్నారు. తక్కువ ధరకు విద్యుత్ లభించినా డిస్కంలు ఎక్కువ ధరకు కొంటున్నాయని జగన్ మండిపడ్డారు.

మన్‌ కీ బాత్‌ కి మాత్రం ఈసీ అనుమతి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని సూచించింది. ప్రతినెల నిర్వహించే ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా కార్యక్రమ నిర్వహణకు ఈసీ బుధవారం అనుమతి ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పీడీపీ, భాజపాల దోస్తీ కుదిరింది..!!

ప్రతిష్టంభనకు తెరదించుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేస్తూ పీడీపీ, భాజపాలు శనివారం రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రాను కలవనున్నాయి. దీంతో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రానికి ఆమె తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు.

దళితులపై దాడి అంటే దేశం వీుద దాడే

మతోన్మాదులు హైదరాబాద్‌లో కన్నయ్యుపై విసిరిన చెప్పు.. రాజ్యాంగంపై విసిరినట్టుగా తాము భావిస్తున్నామని అఖిల భారత దళిత హక్కుల ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. దళితులపై దాడి చేయుడం అంటే దేశం వీుద దాడి చేయుడవేునని అభిప్రాయుపడ్డారు. 

Pages

Subscribe to RSS - 2016