APలో విద్యుత్ చార్జీల మోత దారుణం..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు దారుణంగా పెంచుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం సరికాదన్నారు. తక్కువ ధరకు విద్యుత్ లభించినా డిస్కంలు ఎక్కువ ధరకు కొంటున్నాయని జగన్ మండిపడ్డారు.