ఆంధ్ర భాషా సారస్వతాలకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయ సివిల్ ఉద్యోగి, ఆంగ్ల విద్వాంసుడుగా గణుతికెక్కిన సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. మిణుకు మిణుకు మంటున్న తెలుగు సాహిత్యాన్ని ఒంటి చేత్తో కృషిచేసి జాజ్వల్యమానంగా వెలిగించే కర్తవ్యాన్ని నిర్వహించిన ఆంగ్లేయుడు. 1798 నవంబరు 10న ఒక క్రైస్తవ మిషనరీ కుటుంబంలో కలకత్తాలో (కోల్కతా) జన్మించాడు. ఆయన తండ్రి డేవిడ్ బ్రౌన్ బహు భాషా కోవిదుడు. తన పిల్లలు కూడా అలాగే కావాలని కోరుకునేవాడు. బ్రౌన్ చిన్ననాటి నుంచే ఇంగ్లీషు, హిబ్రూసిరియన్, అరబ్బీ, పారశీక, గ్రీకు, లాటిన్, బెంగాలీ, వంటి పెక్కు భాషలను క్షుణ్ణంగా అభ్యసించాడు.