
దేశవ్యాప్తంగా, రాష్ర్టవ్యాప్తంగా కార్మిక సమస్యలపై, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు మధు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఉద్యమాలపై కేంద్ర కమిటీలో చర్చించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్ రూపంలో ప్రజలపై భారాలు మోపుతున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు.