17 నుండి అసెంబ్లీ సమావేశాలు

 శాసనసభా శీతాకాల సమావేశాలు డిసెంబరు 17 నుంచి 22 వరకు జరుగుతాయని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా, ఎజెండాలో రూపొందించిన అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు.