దేశంలో అధిక ధరలు, ఉపాధి హామీకి కరువు, కనీసవేతనాలు వంటి అనేక సమస్యలతో సామాన్యుడు సతమతమవుతుంటే అవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ల సేవలో, మత చిచ్చు రేపడంలో మునిగి తేలుతున్న బిజెపికి యుపి, మహారాష్ట్ర ప్రజలు మున్పిపల్ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక. యుపి స్థానిక ఎన్నికలు గ్రామీణ ప్రజల నాడిని తెలియజేస్తుండగా, మహారాష్ట్ర మున్సిపల్ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజల మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బిజెపికి ఎదురైన ఘోర పరాజయం చిన్నదేమీ కాదు. అందులోనూ ఆయన దత్తత తీసుకున్న జయపూర్ గ్రామ పంచాయతీలో కాషాయ పార్టీ చావుదెబ్బ తింది.