November

వలసలు..

వలసలు లేకపోతే మానవాళి నేడున్న విధంగా భూగోళం అంతా విస్తరించి ఉండేది కాదు. ఆదిమ మానవుల కాలంలో ఒక గుంపు పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు ఆ గుంపులోని ఒక భాగం వేరే ప్రాంతానికి వలసవెళ్లేవారు. అందువల్ల మానవ నాగరికతా వికాసానికి కూడా ఈ వలసలు కారణమని చెప్పవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, నదులు, సముద్రాలు, అడవులు దాటి కూడా వెళ్ళడానికి ఈ వలసలు దారితీశాయి. బహుశా దీని నుంచే కొన్ని ఊళ్ళ పేర్లకు చివర వలస, ఊరు అనే పదం వచ్చి ఉంటుంది. తగరపు వలస, ఆమదాల వలస, కొత్తూరు, పాతూరు వంటివి పేర్లు అలాగే వచ్చి ఉండవచ్చు. మొట్టమొదట ఈ వలసలు ఆఫ్రికాలో సాగినట్లు చరిత్ర చెబుతోంది.

రైతులకు బెదిరింపులు..

రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై రాష్ట్ర మంత్రులు బెదిరింపులకు దిగుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలనే వ్యూహానికి సర్కారు దిగడం దారుణం. ఒకరి తరువాత ఒకరిగా మంత్రులు రైతులు భూములు ఇచ్చేయాల్సిందేనంటూ బెదిరింపుల పర్వాన్ని ప్రారంభించడం, డెడ్‌లైన్‌ చెప్పి మరీ హెచ్చరించడం దుర్మార్గం. తాము చెప్పిన తేదీ లోగా ఇవ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించైనా గుంజుకుంటామని హెచ్చరించడం రైతులను గందరగోళ పరిచి, తీవ్ర ఒత్తిడికి గురి చేసే ఎత్తుగడే!

పచ్చి దగా..

వందల కోట్లు ఖర్చు చేసి త్రీ-డి ఎఫెక్టుతో దసరా రోజు నిర్వహించిన అమరావతి శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది మినహా రాష్ట్ర ప్రజలకు ఎలాం టి ప్రయోజనం చేకూర్చలేదు. పదహారు మాసాలుగా విభజన హామీల అమలు కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న జనం కనీసం శంకుస్థాపన నాడైనా తమకు భరోసా లభిస్తుందని ఆశించగా ఫలితం శూన్యం. శంకుస్థాపన వేదికపై ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటిస్తారని, తీపి కబురు చెబుతారని బిజెపి, టిడిపి నాయకులు ఊరించగా మోడీ తుస్సు మనిపించారు.

ధరాఘాతం..

 నిత్యావసర వస్తువుల ధరలు ప్రజానీకానికి శరాఘాతంలా తాకుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం. నిన్నటి దాకా ఉల్లి పెట్టించిన కన్నీటితో కుదేలయిన ప్రజలను ఇప్పుడు కందిపప్పు కుదేలెత్తిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కందిపప్పు ధర డబుల్‌ సెంచరీని దాటి ఆ పైనా దౌడు తీస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం క్షమార్హం కాదు. దసరా పండుగ ఉత్సాహంపౖౖె ఈ ధరాఘాతం నీళ్లు చల్లింది. పప్పు వండు కోవాలన్నా తటపటాయించే స్థితికి సాధారణ ప్రజానీకం చేరుకున్న తరువాత ఇంకెక్కడి పండగ!

మతోన్మాదం ప్రమాదకరం:షారుఖ్

ముంబయి : తన యాభయ్యవ జన్మదినం నాడు బాలీవుడ్‌ సూపర్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ దేశంలో పెరుగుతున్న అసహన ధోరణులపై స్పందించారు. ఈ దేశంలో లౌకికవాది కాకపోవడం అన్నింటికన్నా ఘోరమైన నేరమని ఆయన అన్నారు. ఇటీవల వివిధ మేధో రంగాలకు చెందిన వారు, పెరుగుతున్న మతతత్వ సంఘటనలకు నిరసనగా అవార్డుల్ని వాపస్‌ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించగా, దేశంలో అసహనం విపరీతంగా పెరిగిందని షారూఖ్‌ అన్నారు. అవార్డుల్ని వెనక్కి ఇస్తున్న ఫిల్మ్‌మేకర్లు, శాస్త్రజ్ఞులు, రచయితలు, కళాకారులు ధైర్యవంతులని అన్నారు.

రాజధానిలోవిమానాశ్రయం లేనట్టే!

 రాజధాని నగరంలో విమానాశ్రయం నిర్మిరచాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమిరచుకురది. అయితే విమానాశ్రయానికి అవసరమైన భూమిని మాత్రం సిద్ధం చేసి పెట్టుకోవాలని భావిస్తోరది.

ఒప్పందాలన్నీ విదేశీ కంపెనీలకే..

రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకుగానీ, దానికి సాంకేతిక సలహా ఇచ్చేందుకుగానీ చేసుకున్న ఒప్పందాలన్నీ విదేశీ కంపెనీలకే చెందినవి కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం మొత్తం మాస్టర్‌ డెవలపర్‌పేరుతో సింగపూర్‌కు కట్టబెట్టగా, రాష్ట్రంలో కోస్తాతీరంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులను జపాన్‌కు అప్పగిస్తోంది. పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు బాధ్యతతో పాటు అత్యంత కీలకమైన విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటునూ జపాన్‌కు అప్పగించింది. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునీకరణకు జపాన్‌ సాయం తీసుకోనుంది.

క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలి..

గిరిజన రైతులు పండిస్తున్న పత్తి పంటకు క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి నాయకుడు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో మిడియం బాబూరావు మాట్లాడుతూ పత్తి క్వింటాకు రూ.7,762 కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు సిఫార్సు చేసినా కేంద్రం రూ.4,100 మాత్రమే ప్రకటించిందన్నారు. ప్రయివేటు వ్యాపారులు కుమ్మక్కై క్వింటాకు రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపి కుహనా ఆధ్యాత్మికత..

నిషేధం, దుందుడుకు ధోరణులు, ఆజ్ఞలు, మూసివేతలు లాంటివి సహనస్ఫూర్తినీ లేదా మన రాజ్యాంగాన్ని ప్రతిధ్వనిం చవు. అసహన రాజకీయాలకూ, సహన సిద్ధాంతాన్ని ప్రవచించే జైన మత ఆచారాలకు ముడిపెట్టడం హాస్యాస్పదం. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చే చిన్నచిన్న వార్తలన్నింటినీ పాఠకులు కలిపి చూడాలి. జైనులు ఆచరించే పర్యూషన్‌ (ఉపవాసదీక్ష వేడుక) సందర్భంగా మాంసం విక్రయంపై విధించిన నిషేధానికి సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాల తీరు నన్ను బాగా ఆందోళనకు గురిచేసింది. బిజెపి కార్యక లాపాలు ఎవరినీ నొప్పించని విధంగా సున్నితం గా ఉన్నాయని వ్యాఖ్యాతలు విశ్లేషించారు.

Pages

Subscribe to RSS - November