మరో 8 వేలకోట్ల అప్పులు:యనమల

కాకినాడ: 'ఖజానా ఖాళీ అయింది... ఇప్పటికే రూ.8 వేల కోట్లు అప్పులు చేశాం. మరో రూ.8 వేల కోట్ల వరకూ అప్పులు చేసేందుకు అవకాశం ఉంది. ఈపరిస్థితుల్లో అభివృద్ధి చెందిన ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే కాస్త ఊపిరి పీల్చుకునేందుకు సమయం అవసరం. ఇది రెవెన్యూ ఉద్యోగులు అర్థం చేసుకోవాలి' అని ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.