బాక్సైట్‌ వ్యతిరేకరిలేదీక్షలు..

విశాఖ మన్యంలోని చింతపల్లి, జర్రెల ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ, మండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎంవిఎస్‌ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయాలని పాడేరులోని ఐటీడీఏ వద్ద గిరిజన సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1/70 చట్టం ప్రకారం గిరిజన సంపదను ఇతరులు దోచుకోవడానికి వీల్లేదన్నారు.