March

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆందోళన

ఏపీ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.రోడ్డుపై సిపిఎం,సీపీఐ నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

ఉత్తరాంధ్ర,రాయలసీమ వెనుకుబాటు,అభివృద్ధి గురించి అసెంబ్లీ లో ప్రత్యేక చర్చ చేపట్టాలని కోరుతూ

శివారెడ్డి స్పూర్తితో ప్రజా ఉద్యమాలు

'గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మా తల్లో ఒకరు, సిపిఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించారు. ఆయన జీవిత ప్రస్థానం ఎంతో ఉత్తేజభరితమైంది. ఆయన వంటివారు అనేకమంది చేసిన త్యాగాల నుంచే భవిష్యత్తు ఉద్యమ మొలకలు వస్తాయి. వామ పక్షాలు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడమే శివారెడ్డికి ఇచ్చే ఘన నివాళి అవుతుంది' అని వక్తలు పేర్కొన్నారు. సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ మంగళగిరి మండలం కాజలో ఆదివారం నిర్వహించారు.

శివారెడ్డి జీవితం ఆదర్శనీయం

సింహాద్రి శివారెడ్డి బాల్య దశ నుండి దేశ స్వాతంత్య్రం కోసం, శ్రమ దోపిడి లేని సమ సమాజం కోసం చేసిన కృషి ఆదర్శనీయమని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.వేమారెడ్డి అధక్షతన సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత శివారెడ్డి చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు కొండా శివరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శివారెడ్డి కుల, మతాలకు అతీతంగా కష్టజీవులను ఐక్యం చేయటంలో అనితర సాధ్యమైన కృషి చేశారని శ్లాఘించారు.

Pages

Subscribe to RSS - March