March

సీమ హామీలు నెరవేర్చకపోతే బంద్ చేపడతాం..

విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ త్వరలో రాయలసీమ బంద్‌ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వరకు ఎర్రజెండాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గాలిమరల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని తెలిపారు.

మోడీ తృణమూల్‌తో కుమ్మక్కయ్యారా..?

శారదా కుంభకోణంపై సీబీఐ విచారణ, ఖాగ్రఘర్‌(బుర్ద్వాన్‌) పేలుళ్లపై ఎన్‌ఐఏ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడంలేదంటూ ప్రధాని మోడీని సీపీఐ(ఎం) నేత సూర్యకాంత మిశ్రా ప్రశ్నించారు. నారదా ఛానల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడ్డ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని మిశ్రా విమర్శించారు. వారిపై రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ విచారణ జరపకుండా ప్రధాని అడ్డుపడుతున్నారని మిశ్రా అన్నారు. తృణమూల్‌ నేతల అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో బెంగాల్‌ ప్రజలకు స్పష్టం చేయాలని మిశ్రా డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ కళాశాలల్లో 10.9%, ప్రైవేట్‌లో 81.1%

 ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వాలే భ్రష్టు పట్టించాయని పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ వి బాలసు బ్రహ్మణ్యం విమర్శించారు. శాసనమండలిలో సోమవారం ఉన్నత విద్యపై జరిగిన లఘు చర్చలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని, విద్యార్థులు మాత్రం తక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రైవేట్‌ కళాశాలల్లో 81.1శాతం, ఎయిడెడ్‌లో 8.8 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 10.9 శాతం మంది చదువుతున్నారన్నారు. వివిధ దేశాల్లోని ఉన్నత విద్యా విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నా, అలా పేరొందిన యూనివర్సిటీలు మనదేశంలో ఎందుకు లేవో ఆలోచించాలని సూచించారు. 

అఫ్జల్‌గురుపై బిజెపి వైఖరి..?

 'జమ్మూ-కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడటాన్ని సంతోషంగా ఆహ్వానిస్తాం. కానీ, అఫ్జల్‌గురు పట్ల బీజేపీ-పీడీపీ వైఖరిని ఇప్పుడు బీజేపీ వెల్లడించగలదా' అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. 

యనమలతో వైకాపా ఎమ్మెల్యేల భేటీ

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలిద్దరూ ఆదివారం ఇక్కడ యనమలను ఆయన నివాసంలో కలిశారు. వారి భేటీలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే వర్మ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, తెదేపాలోకి చేరికలు వంటి అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

HCU విద్యార్థులకు 352 మంది విద్యావేత్తల మద్దతు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ(హెచ్‌సియు) ఘటనపై మేధావులు, విద్యావేత్తలు, రచయితలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు స్పందించారు. తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. హెచ్‌సియులో జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలను ఖండించారు. ఈ మేరకు వీరంతా కలిసి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రకటనపై సంతకం చేసిన వారిలో నోమ్‌ చామ్‌స్కీ, డా|| గాయత్రి చక్రవర్తి, స్పివాక్‌, డా|| బార్బరా హారిస్‌ వైట్‌, డా||గిలియన్‌ హార్ట్‌, డా|| మైఖేల్‌ డేవిస్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన 352 మంది ప్రొఫెసర్లు కూడా ప్రకటనపై సంతకాలు చేశారు. 

RSS వాళ్ళు ఎప్పుడు దేశభక్తులు అయ్యారో..

వెంకయ్యనాయుడుకు, బీజేపీ వారికి జేఎనయూ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్‌ను చూస్తే బెదురుగా ఉన్నట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో ఆయన సభను ఏర్పాటుచేస్తే దానిపై వెంకయ్య జోక్యం చేసుకుని రద్దు చేయించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. బ్రిటిష్‌ వారితో కుమ్మక్కయి వారికి దాసోహం అన్న RSS వారు ఎప్పట్నుంచి దేశభక్తులు అయ్యారో చెప్పాలన్నారు.

ఉమర్, కన్నయ్య లను కాల్చిపారేస్తాం..

‘నెలాఖర్లోగా ఢిల్లీ నుంచి పారిపోండి... లేదంటే దుర్గాష్టమిలోగా కాల్చిపారేస్తాం’’ అంటూ కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్‌లను ఓ రాజకీయ పార్టీ హెచ్చరించింది. భారత సైన్యంపై కన్నయ్య కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. మీరట్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర ప్రదేశ్ నవనిర్మాణ్ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జానీ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ హెచ్చరికలను పోస్ట్ చేశారు.

బొగ్గు కుంభకోణంలో "ప్రత్యేక " తీర్పు.

బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక కోర్టు నుంచి తొలి తీర్పు వెలువడింది. జేఐపీఎల్ (జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్), జేఐపీఎల్ డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్టా , ఆర్‌సీ రుంగ్టా తప్పుడు డాక్యుమెంట్లతో జార్ఖండ్‌లో బొగ్గు క్షేత్రాలను పొందినట్లు సోమవారం తీర్పు చెప్పింది. ఈ ఇద్దరు డైరెక్టర్లను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.

Pages

Subscribe to RSS - March