జగన్‌ కేసులో ఈడీ కొత్త ఛార్జిషీట్‌

జగన్‌ ఆస్తుల కేసు విషయంలో ఇప్పటి వరకు సీబిఐ ఇచ్చిన ఆధారాలతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా రాంకీ ఫార్మాపై విచారిస్తోన్న ఈడీ జగతి పబ్లికేషన్‌లో రాంకీ పెట్టిన పెట్టుబడులపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ సంస్థ దాదాపు రూ. 10 కోట్లను జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడి పెట్టింది. దీనిద్వారా రూ. 144 కోట్ల లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపణలు చేస్తోంది. దీంతో రాంకీ ఫార్మాకు చెందిన 346 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.