విద్యుత్ చార్జీల పెంపు అమలు..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు 2016-17 విద్యుత్‌ టారీఫ్‌లు ఏపీఈఆర్సీ చైర్మన్ భవానీ ప్రసాద్ గురువారం విడుదల చేశారు. ఏపీలో రూ.216కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెరుగనున్నట్లు తెలిపారు. మొదట రూ. 783 కోట్లు పెంచాలని ఈఆర్సీ ప్రతిపాదించినప్పటికీ రూ.216కోట్లకే పరిమితం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో గృహ వినియోగదారులపై భారం ఉండదని.... రేపటి నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నట్లు ప్రకటించారు.