మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లు..

AP 2016-17కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. వైకాపా సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి నిరసన తెలుపుతూ, బడ్జెట్‌ ప్రతులను చించి ఎగరవేస్తున్న సమయంలోనే సభ ఆమోదం తెలిపింది.రాజ్యాంగంలోని 203, 204 నిబంధనల ప్రకారం ద్రవ్యవినిమయ బిల్లుకు సవరణకు కూడా అవకాశం లేదని, 158 (1) ప్రకారం దీన్ని ఆలస్యం చేయడానికి కూడా లేదని స్పీకర్‌ పేర్కొంటూ మూజువాణి ఓటుతోనే సభ దీనిని ఆమోదిస్తుందని ప్రకటించారు.