July

గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ

గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ సిపిఎం, వివిధ పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన 'చలో భీమవరం' కార్యక్రమాన్ని పోలీసులు ఉద్రిక్తంగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సహా 151 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాలుగురోజుల కిందటే 'చలో భీమవరం' కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా నోరు విప్పని పోలీసులు చివరి నిమిషంలో సభకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు యత్నించారు. మంగళవారం సాయంత్రం నుంచే భీమవరం, గరగపర్రులో భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు.

సుజనాను నిలదీసిన ప్రతిపక్షాలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇరుకున పడ్డారు. ప్రత్యేక హోదా డిమాండ్ పై తన గళాన్ని గట్టిగా వినిపించలేక, తాను మంత్రిగా కొనసాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించలేక ఆయన ఇబ్బందికి గురయ్యారు. ప్రభుత్వం తరపునా మాట్లాడుతున్నారా, పార్టీ తరపున మాట్లాడుతున్నారా అని విపక్ష సభ్యులు ఆయనను ప్రశ్నించారు. 

ఒంటరవుతోన్న బిజెపి..

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై రాజ్యసభలో వాడీ వేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సహా సభలోని పలు రాజకీయ పార్టీలు ఏపీ బిల్లుకు మద్దతు పలికాయి. మద్దతు పలికిన వారిలో సమాజ్‌ వాదీ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, బీజేడీ, టీఎంసీ సహా దాదాపు అన్ని పక్షాలు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో సభలో అధికార బీజేపీ ఇరుకున పడినట్లయ్యింది.

Pages

Subscribe to RSS - July