District News
పార్లమెంటు దగ్గర తుపాకీ మోత కలకలం రేపింది. భారీగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే ఇది పార్లమెంటు వద్ద జరిగిన మాక్డ్రిల్ అని తెలిసింది. ఒకవైపు పంజాబ్లో గురుదాస్పూర్ జిల్లా దినానగర్లో ఉగ్రవాద దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశ సరిహద్దులతో పాటు ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరశిస్తూ సీపీఎం నాయకులు మునిసిపల్ కార్మికులతో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా వచ్చిన కార్యకర్తలు..కార్మికులతో కలెక్టర్ కార్యాలయం అట్టుడికింది. సీఎం డౌన్..తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను..కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పిడిగుద్దులు.. బలప్రయోగం చేయడంతో సీపీఎం నేత బాబురావు,...
విద్యార్థులు, యువత తమలోని జ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి తోడ్పడాలని రాజ్యసభ సభ్యుడు, బెనారస్ యూనివర్సిటీ చాన్సలర్, పద్మవిభూషణ్ కరణ్సింగ్ అన్నారు. ఆదివారం శామీర్పేటలోని బిట్స్ క్యాంపస్లో వైస్ చాన్సలర్ బిజేంద్రనాథ్ జైన్ ఆధ్వర్యంలో 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరణ్సింగ్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సమాచారం ఉందని, అందులో నుంచి జ్ఞానాన్ని వెలికితీయాలని.. ఇందుకు విద్యార్థులు, యువత చైతన్య స్ఫూర్తితో ముందడుగేయాలని కరణ్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ తరం యువత ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించుకునే విద్యను నేర్చుకోవాలని సూచించారు. కొత్త విషయాలు నేర్చుకునేలా మనుసును సిద్ధం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీబాబు అయ్యారని, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు(ఒడిసి) నుంచి ప్రారంభమైన రాహుల్ రైతు భరోసా పాదయాత్ర కొండకమర్ల గ్రామం వద్ద ముగిసింది. 1979లో ఒడిసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరాగాంధీ పాల్గొన్న వేదిక వద్దనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ ప్రాంతంలో రాహుల్ వేపమొక్కను నాటారు. గ్రామశివారులో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో సమావేశ మయ్యారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. 47 మంది బాధితుల కుటుంబాలకు రూ....
నేడు మున్సిపల్ కార్మికల కలెక్టరేట్ల ముట్టడికి మద్దతు తెలియచేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సమ్మెను అణచివేయాలని రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయం దారుణమన్నారు. రాష్ట్ర మంత్రే ఈ ప్రకటన చేయడం సిగ్గుచేటని,ప్రభుత్వం కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా రాజకీయం చేస్తే ఇది ఒక్క కార్మికుల సమస్య గానే కాక రాజకీయ సవాల్ గా కూడా స్వికరించాల్సివస్తుందన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే నెల రోజులైనా ఆందోళనలకు సిద్ధమన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.ప్రభుత్వం వెంటనే కార్మిక జెఎసి తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు ..
విజయవాడ:సింగపూర్ ఇంజనీర్లు తయారుచేసిన రాజధాని మాస్టర్ ప్లాన్ను ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీర్లు తయారు చేయలేరన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇక్కడి ఇంజనీర్లను అవమానించారన్న మధు.. ఈ ముఖ్యమంత్రికన్నా సింగపూర్ మంత్రులే మేలన్న విషయాన్ని చంద్రబాబే పరోక్షంగా ప్రకటించినట్లు అయిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హొదా దాదాపు లేనట్లుగానే తేలిపోయిరది. నాలుగు నెలల క్రితమే రాష్ట్ర అధికా రులకు కూడా కేంద్రం నురచి సంకేతాలు వచ్చాయి. సీనియర్ అధికారి ఒకరు కేంద్ర నిర్ణయాన్ని అనధికారంగా వెల్లడిరచారు కూడా. అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యేక హౌదా తెరపైకి వస్తోరది. అధికార తెలుగుదేశం పార్టీ నురచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇదే అరశంపై గత నాలుగు రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. నెల రోజుల్లో ప్రత్యేక హౌదా వస్తురదని, దీనికోసం పోరాటం కొనసాగి స్తామని, కేంద్రం కూడా ప్రత్యేక హౌదా ఇచ్చేరదుకు ఆలోచన చేస్తోరదని చెప్పుకురటూ వస్తున్నారు. అయితే ఇతర వర్గాల నురచి మాత్రం ఎరటువంటి స్పందన కనిపిరచడం లేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...