District News

విజయవాడ రాజీవ్‌నగర్‌ కరకట్ట ప్రాంతంలోని పేదల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఓ వృద్ధురాలు వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానిక కార్పొరేటర్‌ పైడి తులసి తమను నట్టేట ముంచారని బాధితులు కంటతడిపెట్టారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు పునరావాసం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సిపిఎం నాయకులు మద్దతుగా నిలబడ్డారు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. దీంతో 200 మందికిపైగా ఉన్న పోలీసు బలగాలు మొహరించి అడ్డువచ్చిన సిపిఎం నేతలను, స్థానిక మహిళలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు పి.సాంబిరెడ్డి, బి రమణరావు,...

 ఐదో రోజూ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగింది. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. సమ్మెలో భాగంగా మంగళవారం విజయవాడలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(జెఎసి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వచ్చిన కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ రహదారిపై కార్మికులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో నిర్వహించారు. ఆ తరువాత ప్రెస్‌క్లబ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 'సమ్మె-ప్రభుత్వ వైఖరి'...

 రాజధాని పరిసర ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు, చిన్న, సన్నకారు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. సోమవారం విజయవాడలోని అటవీ శాఖ డిఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్‌), ఎంసిపిఐ(యు)లతో కలిపి ఆరు వామపక్ష పార్టీల నేతృత్వంలో భారీ ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమంలో విజయవాడ రూరల్‌, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల నుండి ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా...

పదో పిఆర్‌సి ప్రకారం రూ. 15,432 కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు శుక్రవారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. పలు జిల్లాల్లో విధుల బహిష్కరించి ర్యాలీలు, రాస్తా రోకోలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. వివిధ రూపాల్లో వెల్లువెత్తిన వీరి ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం విశేషం. వెంటనే సమస్యలను పరిష్క రించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌ తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. విజయవాడ నగర పాలక సంస్థ వద్ద మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు మహాప్రదర్శన...

ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న వారి సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. విజయవాడ కానూరు పప్పుల మిల్లు సెంటర్‌ శ్రీనివాసా కళ్యాణమండపంలో సిపిఎం కృష్ణాజిల్లా కమిటీ విస్తృత సమావేశం గురువారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ, రాజధాని ప్రాంత భూముల్లో పంటలు లేకపోవడంతో ఉపాధిపోయి వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి అసైన్డ్‌ భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెక్కులివ్వకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. క్రిడా పరిధిలో జోన్ల ఏర్పాటుతో కొన్ని...

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ పై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వమిచ్చిన వాగ్దానం మేరకు డ్వాక్రా సంఘాలన్నింటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా దీన్ని వర్తింపజేయాలని పది వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై గురువారం వామపక్షాల ఆధ్వర్యాన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వమే పొదుపు చెల్లిస్తుందనే పేరుతో వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీ మీద వడ్డీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బకాయిలున్నాయనే...

 నవ్యాంధ్ర రాజధాని చెంతనే ఉన్న ఆంధ్రుల వాణిజ్య రాజధాని విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాక్షాత్తు రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రే ’విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెకు’్టకు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ విస్తరిస్తున్న విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి వరకు మెట్రో రైలు మా ర్గాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావించింది. దానికి సంబంధించిన సవిరమైన నివేదికను రూపొందించే బాధ్యతను మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)కి గతేడాది అప్పగించింది. డీఎంఆర్‌సీ కొద్ది...

                  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విడుదల చేసిన ఎపి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు ఎంత ఘనంగా ఉన్నా ఆచరణపై అనుమానాలు కలుగుతున్నాయి. అందుక్కారణాలు లేకపోలేదు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు తొలి సిఎం అయిన చంద్రబాబు గత సంవత్సరం ఆవిష్కరించిన రుణ ప్రణాళిక టార్గెట్లు, సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తాజా ప్లాన్‌కూ అదే గతి పడుతుందేమోనన్న సందేహం కలుగుతుంది. 2014-15 ప్రణాళిక లక్ష్యం రూ.91,459 కోట్లు కాగా బ్యాంకులు 85,345 కోట్లే ఇచ్చాయి. అందులో కూడా ప్రాధాన్యతా రంగాలకు బాగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా విస్మరిస్తారు? ఎప్పుడో ఏడాది కింద ఇచ్చిన హామీ జనానికి గుర్తుండదని కాబోలు ముఖ్యమంత్రి 2015-16లో రూ.1,25,748 కోట్లతో మరోసారి వంచించే...

Pages