District News

రేపల్లె పట్టణంలో ప్రజా సమస్యలపై.. "సీపీఎం వార్డులలో పాదయాత్ర" పేదలు నివాసాలు ఉంటున్న ఏరియాలో పేదలు వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవటం జరుగుతుందిని సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సి.హెచ్.మణిలాల్ తెలిపారు.ఇ ప్రజా సమస్యల పాదయాత్ర గురించి మణిలాల్ మాట్లాడుతు ఉదయం 21 వార్డులోని తేజ కాలనీ నుండి ప్రారంబిచి పలు వార్డులులో ప్రధానంగా పేదలు సమస్యలు అడిగి తెలుసుకోవటం జరిగింది.ఇళ్ళస్థలాలు అర్హులు లిస్టులో ఇప్పుడు అపార్టుమెంట్స్ నిర్మిస్తున్న 1344 మందిలో నిజంగా పేదలుగా ఉన్న మా పేర్లు లేవు అని 19 వార్డులో సోసైటీ భూములో 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలు వాపోయారు,అలానే 21,20 వార్డులో అద్దెలకు ఉంటున్న ముస్లిము కుటంబాలు పేర్లు...

రైతులకు తగిన ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడకపోతే దేశ భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని వక్తలు పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం'పై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రాంగణం మొత్తం రైతుల కిక్కిరిసిపోయింది. వందలాది మంది నిల్చునే వక్తల ప్రసంగాలను విన్నారు. అదనపు కుర్చీలనూ వేయించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ విధానాలపై విధాన పత్రాన్ని విడుదల చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముద్రించిన 'మహారాష్ట్రలో రైతుల మహాపాదయాత్ర...

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్‌ 15న విజయవాడలో నిర్వహించే ర్యాలీ, ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్‌ అధ్యక్షతన విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియా నినాదం డొల్లతనం బయటపడిందని చెప్పారు. నోట్ల రద్దు వల్ల 80 లక్షల మందికిపైగా ఉపాధి కోల్పోయారని, జిఎస్‌టి వల్ల ధరలు పెరిగాయి తప్ప తగ్గలేదని విమర్శించారు. పెట్టుబడులు...

ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం నుండి ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకు పోయిందని, పంటలకు గిట్టుబాటు ధరల్లేక నాలుగేళ్లలో రెండు లక్షల మంది రైతులు ఆత్యహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైతులు తమ...

రాష్ట్ర సమాగ్రాభివృద్ధి కోసం సిపిఎం, సిపిఐ చేపట్టిన జాతా సెప్టెంబర్‌ 10, 11న గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని, జాతాను విజయవంతం చేయాలని సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాతా వివరాలు వెల్లడించారు. రాష్ట్ర సమాగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను ప్రచారం చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 15న విజయవాడలో మహాగర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో వివిధ రంగాలపై సదస్సులు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు విశాఖపట్టణం, అనంతపురం నుండి రెండు బస్సు...

వ‌ర‌ద‌ల వల్ల‌, క‌రువు ప్రాంతాల‌లో న‌ష్ట‌పోయిన వాస్త‌వ సాగుదారులు, కౌలు రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని సిపిఎం కేంద్ర‌క‌మిటి స‌భ్యులు వి. శ్రీ‌నివాస‌రావు అన్నారు. గుంటూరులో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో క‌రువుల వ‌ల‌న, వర్షాల వ‌ల్ల సంభ‌వించిన వ‌ర‌ద‌లు వ‌ల్ల రైతాంగం తీవ్రంగా న‌ష్ట‌పోయార‌న్నారు. క‌రువు, వ‌ర‌ద‌ల వ‌ల‌న న‌ష్ట‌పోయిన వారిని ఆదుకోక‌పోతే వ్య‌వ‌సాయం గ‌ట్టెక్క‌దు. ముఖ్య‌మంత్రి వ‌ర‌ద‌ల ప్రాంతాల‌లో సంద‌ర్శించి రైతుల‌కు ఎక‌రానికి 10వేల రూపాయ‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కౌలు రైతుల గురించి ముఖ్యమంత్రి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయం అభివృద్ది చెంద‌డం క‌ష్టం అన్నారు. వాస్త‌వ సాగుదారుల‌కు...

గుంటూరులో అక్ర‌మంగా అరెస్టు చేసిన ముస్లిం యువ‌కుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని, వారిపై పెట్టిన అక్ర‌మ‌కేసుల‌ను ఎత్తివేయాల‌ని కోరుతూ సిపిఎం,సిపిఐల ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు.అక్ర‌మంగా అరెస్టు అయిన బాధితుల కుటుంబాల‌ను పరామర్శించడానికి  బ‌య‌లుదేరిన సిపిఎం కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీల‌తో విరుచుకుప‌డ్డారు.సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మ‌ధు, రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు వి.కృష్ణ‌య్య‌, సిపిఐ నాయ‌కులు ఓబులేసు, మాజీ ఎమ్మేల్సీ కె.ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావుల‌ను అరెస్టు చేసి న‌ల్ల‌పాడు పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు 

దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 23న చలో గుంటూరు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడును మధు ఆధ్వర్యంలో సిపిఎం బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. డిసెంబరు 31, జనవరి ఒకటిన దళితులపై పెత్తందార్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి గురైన దళితులను మధు పరామర్శించిన అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకూ అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. గొట్టిపాడు ఘటనపై ఈనెల 23న రాష్ట్రంలోని దళితులందర్నీ సమీకరించి 'చలో గుంటూరు' నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామంలో దళిత వాడలో కనీస సౌకర్యాలు లేవని, వారు తీవ్ర వివక్షతకు...

అమరజీవి కామ్రేడ్‌ మాకినేని బసవ పున్నయ్య స్పూర్తితో నేటి యువతరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపు నిచ్చారు.
నేడు 2/7 బ్రాడీపేట సిపియం కార్యాయంలో బసవపున్నయ్య 103వ జయంతి సందర్భంగా నగర కార్యదర్శి కె.నళినికాంత్‌ అధ్యక్షతన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పార్టీ సీనియర్‌ నాయకులు కె.రామిరెడ్డి బసవపున్నయ్య చిత్రపటానికి పూమాల‌వేసి నివాళుర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కామ్రేడ్‌ బసవపున్నయ్య తన జీవితాంతం కష్టజీవు సమస్యల‌ పరిష్కారానికి కృషి చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అతివాద, మితవాద విచ్ఛిన్నకర ఉధ్యమాల‌కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. సిపియం పార్టీ ఏర్పడిన...

భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుల్లో ఒకరైన కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య రేపల్లె మండం తూర్పుపాలెంలోని భూస్వామ్య కుటుంబంలో 1914 డిసెంబరు 14న జన్మించారు. తల్లిదండ్రలు చారుమతి, అప్పయ్య. భార్య జగదాంబ. కొద్దికాం సాంప్రదాయ బద్దమైన విద్యనభ్యసించారు. అనంతరం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదివారు. బందరు నోబుల్‌ కళాశాలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 1930లో దేశస్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన తరంతో ఆయన కలిసిమెసి పనిచేసి అనుభవాు పంచుకున్నారు. ఆనాడు కాంగ్రెస్‌ నాయకత్వం ఉద్యమాన్ని తాత్కాలికంగా రద్దు చేయటంతో అసంతృప్తి చెందిన కామ్రేడ్‌ బసవపున్నయ్య భారతదేశ ప్రజ సమస్యు సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే పరిష్కారం కాగవన్న ధృడమైన విశ్వాసంతో 1934`35లో కమ్యూనిస్టు...

Pages