District News

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే రాజధాని నిర్మాణానికి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చిన కార్మికులను ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన అవసరంముందని వారు సూచించారు. ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో తీవ్ర ఉద్దికత్తల మధ్య సీపీఎం ఎమ్మెల్సీలు ఆ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ..వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా పశువులకంటే హీనంగా వారితో పనిచేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఏపీ సర్కారు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఏపీ తాత్కాలిక రాజధాని ప్రాంతంలో దేవేందర్ అనే కార్మికుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుడి మృతిపై ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ సీపీఎం నేతలు రాజధాని యాత్ర చేపట్టారు. కార్మికులకు మద్ధతు తెలపాటానికి వచ్చిన నేతలపై పోలీసులు లాఠీ చేశారు. 

వెలగపూడి సచివాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. సచివాలయం నిర్మాణ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్ష నేతలు కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఎం నేతలను మంగళవారం నాడు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో సీపీఎం నేతలను  అరెస్ట్ చేసి పోలీసులు  నిర్భంధంలో వుంచారు.కార్మిక పక్ష నేతలమైన మేము దేనికి భయపడమనీ కార్మికులకు మా మద్ధతు ఎప్పుడూ వుంటుందని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వేస్తున్నారా? అన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పార్లమెంట్‌ సమాధానమిస్తూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ..

 అమరావతి.. అదొక ప్రాచీన నగరం. శాతవాహనుల కాలంలో అదే రాజధాని. బౌద్ధానికీ ఆ ప్రారతం నాడు కీలక స్థానం. అలాంటి అమరావతి నేడు రాష్ట్రానికి రాజధానిగా మారి, తన ఉనికినే కోల్పోయే పరిస్థితి నెలకొరది. చారిత్రక ప్రాముఖ్యం గల ఆ ప్రారతం ఆధునిక కట్టడాలు రానున్నాయి. గత వైభవం చరిత్రకే పరిమితం కానుంది. 
రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిరచారు. అందుకు జపాన్‌, చైనా, అమెరికా, బ్రిటన్‌, సిరగపూర్‌, మలేషియా వంటి దేశాల వారిని ఆహ్వానిరచి, అద్భుత, ఆధునిక నగరాన్ని నిర్మిరచాలని కోరారు. డిజైన్లు కూడా సిద్ధం చేయిరచారు. కానీ ఆ డిజైన్లలో అరతా విదేశీ పోకడలే కనిపిస్తున్నాయి. స్థానికత్వం, చరిత్ర జ్ఞాపికలు ఎక్కడా లేవని సర్వత్రా...

అమరావతి రాజధాని నగర తొలి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. నేచర్‌, కల్చర్‌, ఫ్యూచర్‌ అనే మూడు కీలకాంశాల ఆధారంగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రణాళికను ఎంపిక చేశారు. తొలిదశలో ఐకానిక్‌ నిర్మాణాలుగా ఈ రెండింటినీ చేపట్టనున్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ, తొమ్మిది లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మాణాలను చేపట్టానున్నారు. వీటికి సుమారు రూ.720 కోట్లు వ్యయం అంచనా వేశారు. ప్రతి నిర్మాణంపైనా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ భవనాన్ని 210 కుర్చీల సామర్థ్యంతో నిర్మించను న్నారు. ఇది ఉద్దండ్రాయునిపాలెం వద్ద నిర్మాణమ వుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన భవనాల నిర్మాణాలకు వివరణాత్మకంగా నమూనా (డిటైల్డ్‌ అర్బన్‌ డిజైన్...

పేదలు ఐక్యంగా ఉండటం ద్వారా సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన సుందరయ్య కాలనీ సిపిఎం నాయకుడు కె ఆంజనేయులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన సందర్బంగా గురువారం రాత్రి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆర్టీవో కార్యాలయం నుండి కాలనీకి ర్యాలీ నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఆంజనేయులుకు చికిత్స అందించి కోలుకునేట్లు చేయటంలో జిజిహెచ్‌ వైద్యుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు ఏపార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరి పేదలకు అన్యాయం చేస్తున్నారని, అలాంటి వారు ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు. రౌడీలను...

అంకితభావం, వృత్తి నైపుణ్యంతో జిజిహెచ్‌ వైద్యులు అద్భుత రీతిలో శస్త్రచికిత్సలతో చేసి, అరుదైన స్దితిలో వ్యక్తికి ప్రాణం పోయడం సర్వత్రా హర్షణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అభినందించారు. రౌడీషీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో జిజిహెచ్‌లో చేరిన సిపిఎం శాఖ కార్యదర్శి ఆంజనేయులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అత్యంత తీవ్రత కలిగిన ముఖంపై గాయాలతో మరణం అంచున నిలిచిన ఆంజనేయులుకు జిజిహెచ్‌లోని వివిధ విభాగాల వైద్య నిపుణులు శ్రమించి అరుదైన శస్త్రచికిత్సలు చేయడంతో ఆంజనేయులు బతికి బయటపడ్డారని పేర్కొంటూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు వైద్య నిపుణులకు ఘనసత్కారం చేశారు. ఆర్థోపెడిక్‌ సెమినార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి...

అభ్యుదయ, వామపక్ష శక్తులను విఛ్చిన్నం చేయటం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదని, పేద, ధనిక తారతమ్యాలు ఉన్నంత కాలం ఆయా శక్తులుంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని నిరశిస్తూ ఆదివారం నగర పార్టీ కార్యాలయం నుండి శంకర్‌ విలాస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఢిల్లీలోని జెఎన్‌యు ఎంతో మంది మేధావుల్ని, దేశానికి నాయకుల్ని అందించిందన్నారు. అలాంటి వర్సీటీలో చోటు చేసుకున్న ఒక ఘటనను ఆధారం చేసుకొని అక్కడున్న అభ్యుదయ, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ విచ్ఛన్నం చేయటానికి బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.ఈ నేపధ్యంలోనే సిపిఎం జాతీయ కార్యాలయంపైనా దాడి జరిగిందని,...

సుంద‌ర‌య్య కాల‌నీ పార్టీ శాఖ కార్య‌ద‌ర్శి కామిశెట్టి ఆంజినేయులు,భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ఎ స‌తీష్‌ల పై హత్యాయ‌త్నం చేసిన రౌడి మేక‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, సుంద‌ర‌య్య కాల‌నీ పేద‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సిపియం రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ‌స‌భ్యులు వి.ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. హాస్పిట‌ల్ చికిత్స పొందుతున్న ఆంజినేయులు, స‌తీష్‌ల‌ను ప‌రామ‌ర్శించారు. రౌడిల‌పై ముందుగా పొలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన స్థానిక సిఐ స్పందించ‌క పోగా దెబ్బ‌లు త‌గిల‌న త‌రువాత రాండి అన‌టం, కాల‌నీకి వెళ్ళి సిపియం నాయ‌కుల‌ను ఆఫీసు నుండి వెళ్ళి పోమ్మ‌ని చెప్ప‌టం చూస్తే రౌడి మూక‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిన‌ట్లు ఆర్ధమ‌వుతున్న‌ద‌ని సిఐ తిరుపై మండిప‌డ్డారు. త‌క్ష‌ణ‌మే సిఐ మీద...

Pages