2016

కన్నయ్య పై మళ్లీ దాడి చేస్తాం..

మూడు గంటలపాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను చితకబాదినట్టు ఇండియాటుడే మీడియా సంస్థ నిర్వహించిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు న్యాయవాదులు చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆ ముగ్గురు లాయర్లలో విక్రమ్‌ సింగ్‌ చౌహాన్‌, యష్‌పాల్‌ సింగ్‌, ఓం శర్మ ఉన్నారు. మేం అతడిని వదిలి పెట్టం. అతడిని చితకబాదుతాం. నాపై ఎన్ని కేసులు మోపినా లెక్కచేయను. వాడిపై పెట్రోల్‌ బాంబుతో దాడి చేస్తాను. నాపై హత్యానేరం నమోదైనా ఏమాత్రం వెనుకాడబోను...అని యశ్‌పాల్‌ సింగ్‌ అన్నారు

ఏచూరిని ఆహ్వానించిన నేపాల్‌ ప్రధాని..

భారత్‌, నేపాల్‌ సంబంధాలపై నేపాల్‌ ప్రధానితో ఏచూరి చర్చించారు. రెండు దేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడాలని కోరినట్లు చెప్పారు. గతంలో నేపాల్‌ రాజ్యాంగ సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల నుంచి మళ్ళీ యథాతథస్థితికి చేరుకోవడానికి సిపిఎం జోక్యంతోనే జరిగిందన్న అంశం చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంలో నేపాల్‌కు రావాల్సిందిగా ఏచూరిని నేపాల్‌ ప్రధాని కోరారు. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య అరెస్ట్‌, పఠాన్‌కోట్‌ దాడి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశముంది. విపక్షాల అసహనానికి ప్రభుత్వ పక్షం సహనం వహించే ప్రయత్నానికి మధ్య కురుక్షేత్ర సంగ్రామం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చే జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. 

సుజనా చౌదరిపై ఆరోపణలు..

సీబీఐ మాజీ డైరెక్టర్‌ కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారనే ఆరోపణలతో ఇప్పటికే కళ్యాణ్‌ శ్రీనివాస్‌ అరెస్ట్ అయ్యారు.ఇదిలా ఉంటే ఇప్పటికే సుజనా చౌదరిపై గతంలో రూ. 100 కోట్లకు రుణం తీసుకుని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ ను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పుడు ఆయనపై ఈ ఆరోపణలు రావటం సంచలనం సృష్టిస్తోంది. కాగా, మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. 

మారిన మాస్టర్ ప్లాన్..

స్వల్ప మార్పులతో మాస్టర్‌ప్లానును విడుదల చేశారు. ఉత్తర దక్షణ దిశలుగా ఉండే ఐదురోడ్లు, తూర్పు పడమరలుగా ఉండే ఒకరోడ్డును కొద్దిగా అటూ ఇటూ జరిపారు. దీంతోపాటు నీరుకొండ దగ్గర ఏర్పాటు చేయనుకున్న రిజర్వాయర్‌ స్థలాన్ని, కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలనూ మార్పులు చేర్పులు చేశారు. మంత్రి నారాయణ విడుదల చేసిన ప్లానులో దాదాపు గ్రామాల్లో రోడ్లు వెళ్లడాన్ని నివారించారు. ఒక్క ఐనవోలు గ్రామంలో మాత్రమే నష్టాన్ని కొద్దిగా తగ్గించారు. ఉండవల్లి గ్రామంలో గతంలో నాలుగురోడ్లను ప్రతిపాదించి వాటిని ఎత్తేశారు. అయితే సీడ డెవపల్‌మెంట్‌ ఏరియా ఉన్న మందడంలో రోడ్లను మార్చలేదు.

ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణం ఆపాలి

 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒక్క ఇటుకను పేర్చినా ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో బహిరంగ సభ నిర్వహించారు.ఇంట్లో పెట్టుకునే ఎసికి వినియోగించే అమ్మోనియం వాయువు కంటే లక్షల రెట్లు అధికంగా ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీల్లో ఐస్‌ తయారు కావడానికి వినియోగిస్తారని, ఆ సమయంలో గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందితే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో జన్మించి పరిసర ప్రాంతాల్లో ప్రజలు బతికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

సీమ హామీలపై స్పష్టత ఏది? : కృష్ణయ్య

రాయలసీమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా చెప్పకపోవడాన్ని వామపక్షాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.మదనపల్లి బస్టాండులో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చువుతుందని ముఖ్యమంత్రి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారని, అయితే గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో స్పష్టం చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల మొదటి దశ, రెండో దశ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామంటూ డొంక తిరుగుడుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అభివృద్ధి ముసుగులో ముఖ్యమంత్రి..

పునరావాసం తరువాతే ప్రాజెక్టు పనులు

       వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం కల్పించిన తరువాతే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని హితవు పలికాయి. నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవనీ, వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపాయి. ఆదివారం స్థానిక క్రాంతిభవన్‌లో చౌదరి తేజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, లోక్‌సత్తా, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ, వైసిపి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది..... నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది.....
నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది..... నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది.....
నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .
                                                                      - సిహెచ్‌.బాబూరావు డిమాండ్ 

Pages

Subscribe to RSS - 2016