
మూడు గంటలపాటు జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను చితకబాదినట్టు ఇండియాటుడే మీడియా సంస్థ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో ముగ్గురు న్యాయవాదులు చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆ ముగ్గురు లాయర్లలో విక్రమ్ సింగ్ చౌహాన్, యష్పాల్ సింగ్, ఓం శర్మ ఉన్నారు. మేం అతడిని వదిలి పెట్టం. అతడిని చితకబాదుతాం. నాపై ఎన్ని కేసులు మోపినా లెక్కచేయను. వాడిపై పెట్రోల్ బాంబుతో దాడి చేస్తాను. నాపై హత్యానేరం నమోదైనా ఏమాత్రం వెనుకాడబోను...అని యశ్పాల్ సింగ్ అన్నారు