2016

JNU విద్యార్థుల పార్లమెంట్‌ మార్చ్‌..

న్యూఢిల్లీ : జెఎన్‌యు విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌, మరో ఇద్దరిపై దేశద్రోహ కేసును నిరసిస్తూ విద్యార్ధులు బుధవారం పార్లమెంట్‌కు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కేసులో అరెస్టయి జైల్లో వున్న మిగిలినవారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు

'తుమ్మపాల సుగర్స్‌'లో ఉద్రిక్తత

 - ఎమ్‌డి ఛాంబర్‌లో రైతులు, కార్మికుల బైటాయింపు
 - తలుపులు బద్దలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
 - బాలకృష్ణ, ఫణిరాజ్‌, హరినాథ్‌బాబులపై కేసులు బనాయింపు

సర్వే పేరుతో పేదల ఇళ్ల తొల‌గింపుకు ప్రభుత్వం కుట్ర ప‌న్న‌డాన్ని వ్యతిరేకించండి. పాదయాత్రలో సిపిఎం - సిపిఐ నాయ‌కులు పిలుపు

దివీస్‌ విస్తరణ ఆపకుంటే పోరు తీవ్రం

చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ విస్తరణ పనులను ఆపకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం హెచ్చరించారు. యూనిట్‌ 3 నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో చిప్పాడ పంచాయతీ పరిధిలోని సిటీనగర్‌ జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం లోకనాధం దీక్షాశిబిరాన్ని ప్రారంభించారు.

పచ్చని పల్లెలను విషతుల్యం చేయడమే అభివృద్ధా ?

భీమిలి మండలం చిప్పాడలో దివీస్‌ లేబొరేటరీస్‌ యూనిట్‌ 3 విస్తరణ ద్వారా పచ్చని పల్లెలు విషతుల్యమవుతాయని, అటువంటి అభివృద్ధిని ఎవ్వరూ కోరుకోరని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి అన్నారు. యూనిట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సిటీ నగర్‌ జంక్షన్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ప్రభావతి సందర్శించి సంఘీభావం తెలిపారు.

స‌మ‌ర‌శీల ప్ర‌తిఘ‌ట‌న‌

                 శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార నిర్వాసితులు ఆదివారం సమరశీల ప్రతిఘటన చేశారు. తమ భూములకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా పోలీసు బలగాలతో పనులు చేయిస్తుండ టంపై తీవ్ర ఆగ్రహం చెరదారు. శనివారం తమ ఆందోళనా శిబిరాన్ని పోలీసులు కూల్చి వేయడంపై ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు సెక్షన్‌ 30ని ధిక్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనుల కోసం అధికారులు వేసిన రేకుల షెడ్డును కూల్చివేశారు. అక్కడున్న పరికరాలను వంశధారలో పడేసి తమ నిరసనను ప్రభుత్వానికి చూపారు. అంతేకాదు స్థానిక తహశీలుదారును ఘెరావ్‌ చేశారు.

ఇళ్ళులేనివారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యులు పరిష్కరించాల‌ని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

ఇళ్ళులేనివారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సమస్యు పరిష్కరించాల‌ని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా ముఖ్యమంత్రికి పేద పట్ల చిత్తశుద్ది లేదని నేత విమర్శ

  ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే  ఎన్నికల‌ వాగ్ధానం మేరకు పేదల‌కు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాల‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని తహశీల్థార్‌ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు.  296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా  ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు.

Pages

Subscribe to RSS - 2016