రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు. శుక్రవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీపుజాత ధర్మవరం నుంచి గొల్లపల్లి, ఉప్పునేసినపల్లి, చిగిచెర్ల, ముష్టూరు, బత్తలపల్లి, తాడిమర్రి, రామాపురం మీదుగా ముదిగుబ్బకు చేరుకుని అక్కడినుంచి ధర్మవరానికి చేరుకుంటుందన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు.