2016

కన్నయ్య సభలో భజరంగ్ దళ్, ఏబీవీపీ..

నాగ్పూర్ లో కన్నయ్య కుమార్ సభలో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నాగ్ పూర్ నేషనల్ కాలేజీలో జరుగుతున్న సభలో కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనపై చెప్పు విసిరారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

125 మీటర్ల జండా ప్రదర్శన

మనువాద౦కాదు-మానవత్వ౦కావాలి.........
మనువాద౦నుండి-మనదేశన్ని రక్షి౦చు కొ౦దా౦....
తిరుపతిలో అంబేత్కర్ 125వ జయంతి సందర్భంగా సిపియం ఆధ్వర్యంలో 125 మీటర్ల జాతీయ జెండా తో పురవిధుల్లో ప్రదర్శన.

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి....

 (విశాఖ రూరల్)  ఈ రోజు విశాఖ జిల్లా సిపియం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

చిత్తశుద్దితో రాజ్యాంగం అమలుతోనే సామజిక న్యాయం సాధ్యం

 చిత్తశుద్దితో రాజ్యాంగం అమలుతోనే సామజిక న్యాయం సాధ్యం అని ప్రముఖ రచయిత శ్రీ కంచే ఐలయ్య అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ఉక్కునగరం లో కులవివక్షత వితిరేక పోరాట సంగం,ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం మరియు డి ఐ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో సామజిక న్యాయం అనే అంశంపై జరిగిన జాతీయసదస్సు లో అన్నారు

కరకట్ట ఇళ్ళ సమస్యపై తెలుగుదేశం వైఖరి స్పష్టం చేయాలి - సిపిఎం పాదయాత్రలో సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌

ఒక పక్కన అధికారుల‌తో నోటీసు ఇప్పిస్తూ, ఇళ్లు ఖాళీ చేయాల‌ని బెదిరిస్తూ మరోపక్కన మీరెవ్వరూ నోటీసులు తీసుకోవద్దు మీకు మేము అండగా వుంటామని చెబుతున్న తొగుదేశం ప్రజాప్రతినిధు ప్రజల‌ను మోసగించవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సి.హెచ్‌. బాబూరావు అన్నారు. ఆదివారం భవానీపురం పున్నమి హాోటల్‌ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్రలో బాబూరావు పాల్గొని కరకట్ట వాసుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవద్దని చెప్పే ప్రజాప్రతినిధులు తమ అధికార పార్టీ అధినేతతో మాట్లాడి నోటీసు రద్దుచేయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. ఆ పనిచేయకుండా ఇక్కడకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం ప్రజను మోసగించటమే అవుతుందన్నారు.

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాల పై విచారణ జరపాలి.

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాపై విచారణ జరపాలి.లబ్ధిదారుకు నెలకు 5 వేలరూపాయిఅలు చొప్పున ఇంటి అద్దె చెల్లించాలి.
    
    రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలోనే మొదటి మోడల్‌ కాలనీగా 2వార్డులో గల  సూర్యతేజనగర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. రే ఇళ్ళు నిర్మించేవరకు ఆ కాలనీ ప్రజానీకం నివాసం ఉండడానికి తాత్కాలిక గృహాలు  నిర్మించి ఇవ్వాలని నిర్ణయం చేశారు. దీనిలో భాగంగా ఆరిలోవలో ప్రభుత్వం నిర్మిస్తున్న 208 ఇళ్ళను సిపిఎం నగర కార్యదర్శి డా॥ బి. గంగారావు నాయకత్వంలోని బృందం ఈరోజు పరిశీలించడం జరిగింది.

110 ఎకరాల్లో 50 ఎకరాలపై అధికార పార్టీ..

విమ్స్ కు కేటాయించిన 110 ఎకరాల భూమిలో  50 ఎకరాలపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను వేశారని  వామపక్ష నేతలు చెబుతున్నారు. విమ్స్ ను పూర్తి స్థాయిలో ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగించాలని వామపక్షాలు నిర్ణయించారు. 

మాల్యాపై ED ఏ నిర్ణయం తీసుకోనుందో..

మనీలాండరింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న విజయ్‌ మాల్యా ఈడీని మరింత గడువు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు రాలేనని స్పష్టం చేశారు. బ్యాంకులతో చర్చలు నడుస్తున్నాయని... తాను భారత్‌కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.ఇవాళ విజయ్ మాల్యా ఈడీ ముందు హాజరుకావాల్సివుంది... కానీ హాజరు కాలేదు. తాను భారత్‌కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈడీ ముందు హాజరుకాకపోవడంతో విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ, వీసా రద్దు చేసే అవకాశం ఈడీకి ఉంది. ఈడీ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి...

Pages

Subscribe to RSS - 2016