
మనీలాండరింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న విజయ్ మాల్యా ఈడీని మరింత గడువు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు రాలేనని స్పష్టం చేశారు. బ్యాంకులతో చర్చలు నడుస్తున్నాయని... తాను భారత్కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.ఇవాళ విజయ్ మాల్యా ఈడీ ముందు హాజరుకావాల్సివుంది... కానీ హాజరు కాలేదు. తాను భారత్కు రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈడీ ముందు హాజరుకాకపోవడంతో విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ, వీసా రద్దు చేసే అవకాశం ఈడీకి ఉంది. ఈడీ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి...