2016

ప్రమాదాల హబ్‌గా విశాఖ

పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారని, ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రేంపెక్స్‌లో ఇద్దరు, మైలాన్‌లో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారని, లోహిత్‌ ఫార్మాలో బాయిలర్‌ లీకేజ్‌ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎస్‌ఇజెడ్‌ అలివెరాలోనూ ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు నివారించకుండా కోస్తా తీరమంతా ఫార్మా, పెట్రో, కార్బన్‌ తదితర విష కంపెనీలు, ప్రమాదకర కంపెనీలను ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల లాభాల కోసం స్థానికులను బలిచేయడం దుర్మార్గమన్నారు.

ఈ రోజు అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా డబగార్డెన్ వద్ద పుష్పంజిలి

ఈ రోజు అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా డబగార్డెన్ వద్ద పుష్పంజిలి గట్టించారు. ఈ సందర్భంగా సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

APలో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం

రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కృష్ణాజిల్లా జక్కంపూడిలో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించనున్నారు. జక్కంపూడిలో 10వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు

బౌద్ధం స్వీకరించనున్న రోహిత్‌ కుటుంబం

ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్‌ వేముల కుటుంబం బౌద్ధమతం స్వీకరించనున్నట్లు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ బుధవారం తెలిపారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ 125వ జయంతి సందర్భంగా రోహిత్‌ తల్లి, సోదరుడు బౌద్ధ బిక్షువుల సమక్షంలో దీక్ష స్వీకరిస్తారని పేర్కొన్నారు. 

హిందూ అంటే హిందూయే: సుప్రీమ్

హిందూ మతంలో హిందూ మగ, ఆడ అనే వర్గీకరణ లేదని.. హిందూ అంటే హిందూయేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా.. ఆచారాల ప్రాతిపదికన శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించలేరని స్పష్టం చేసింది. 

కొత్తగా చేరేవారికే IIT ఫీజు పెంపు

ఇప్పటికే ఐఐటీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు రుసుముల పెంపు ఉండబోదని మానవ వనరుల అభివృద్ధి శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని ఐఐటీల సంచాలకులకు లేఖ రాసింది. రుసుముల పెంపుపై ఐఐటీ-ఖరగ్‌పూర్‌ విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ విషయాన్ని స్పష్టీకరించింది. ‘‘2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పొందే విద్యార్థులకే సవరించిన రుసుములు వర్తిస్తాయి. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతమున్న రుసుములనే చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది.

రాష్ట్ర మాతగా గోవును ప్రకటిస్తే మద్దతు:కాంగ్రెస్

 ‘రాష్ట్ర మాత’గా గోవును ప్రకటిస్తామంటే తాము అందుకు మద్దతిస్తామని గుజరాత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత శంకర్‌ సింగ్‌ వాఘేలా అన్నారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ...గోరక్ష ఏక్తా సమితికి ఈ డిమాండ్‌ని తెరపైకి తెచ్చిందన్నారు. భాజపా ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

NTR గార్డెన్స్‌లో125 అడుగుల అంబేద్కర్

ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లోని హిల్‌ రాక్‌ వద్ద 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా జరిగిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు

సిపిఎం నేత రాఘవులను అడ్డుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వతీరు వివాదాస్పదమైంది. ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలస్యంగా హాజరయ్యారు. ఈ వేడుకలకు మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి శిద్దా రాఘవరావు హాజరుకాలేకపోయారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు రాఘవులును అడ్డుకున్నారు. మంత్రి శిద్దా రాఘవరావు వచ్చే వరకు ఆగాలని సూచించారు. అయినప్పటికీ రాఘవులు పోలీసులను ప్రతిఘటించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. 

అంటరానితనాన్ని రూపుమాపాలి :మధు

దళితుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు రావడంతోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కారెం శివాజీని ఛైర్మన్‌గా నియమించారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అంటరానితనాన్ని నిర్మూలించినపుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళులర్పించినట్లని అన్నారు.   

Pages

Subscribe to RSS - 2016