2015

భూసేక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తూ బంద్ సంపూర్ణం..

ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇచ్చిన బంద్‌ పిలుపు ఉండవల్లిలో సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే దుకాణాలన్నీ మూతపడ్డాయి. పెట్రోలు బంకుతో సహా పెద్ద వ్యాపారసంస్థలన్నీ స్వచ్ఛంధంగా బంద్‌చేసి రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ముందుగా సిపిఎం, వైసిపి నాయకులతో కలిసి రైతులు ఉండవల్లి సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిడా సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశత్వంగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా భూసేకరణను నిలుపుదలచేస్తామని చెప్పారు.

నిరుద్యోగం తొలగింపునకు నిర్దిష్ట చర్యలు..

ఉద్యోగిత పెరిగేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను నియంత్రించాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం 1.2 కోట్ల మంది ఉద్యోగం కోసం కొత్తగా మార్కెట్‌లోకి వస్తారు. కాబట్టి యువతీయువకులకు ఉద్యోగాలు, పని కల్పించడం ఒక ప్రధాన సమస్య. కోటీ నాలుగు వేల మందికి ఉద్యోగాలు కావాల్సి ఉండగా లేబర్‌ బ్యూరో (సిమ్లాలో ఉంది) లెక్కల ప్రకారం దుస్తులు, తోళ్ళు, లోహాలు, ఆటోమోబైల్సు, వజ్రాలు, నగలు, రవాణా, ఐటి/బిపిఒ, చేనేత, మర మగ్గాలు- ఈ ఎనిమిది రంగాలలో 2013లో 4.19 లక్షల ఉద్యోగాలే కొత్తగా వచ్చాయి.

ఆత్మహత్యల భారతం..

నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు.

పరిశ్రమాధిపతులకు డికెటి భూములు..

 చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద 1,60,938 ఎకరాలకు పైగా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న డికెటి (అసైన్డ్‌) భూములపై కేంద్రీకరించి వివరాలను సేకరిస్తోంది. ఈ భూములు ఒకే దగ్గర వందల, వేల ఎకరాలు ఉంటున్నాయి. పాత చట్టాల ఆధారంగా ప్రభుత్వ అవసరాలకు తీసుకోవచ్చని భయపెట్టి తీసుకుంటున్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా, అది ప్రభుత్వ స్థలంగా చూపి లాక్కోవాలని చూస్తున్నారు.

ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి..

పరిశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందటానికి ప్రత్యేకహోదాను సాధించటం అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఆదాయాన్నిచ్చే రాజధాని నగరం హైదరాబాద్‌ తెలంగాణకు రాజధానిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా లోటులో ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.16,000 కోట్ల లోటు ఉంది. విశాఖపట్నం, తిరుపతి లాంటి చోట్ల మినహా పారిశ్రామికాభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి స్థితిలో రాష్ట్రం ఆభివృద్ధిని సాధించాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించటం తప్పనిసరి.

ప్రమాద ఘంటిక..

సోమవారంనాటి భారతీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం రానున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతకు ప్రమాద ఘంటిక. దేశ మార్కెట్‌ చరిత్రలో బ్లాక్‌ మండే. నష్టాల సునామీలో మదుపర్లకు చెందిన సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయని అంచనా. సెన్సెక్స్‌ 1,621.51 పాయింట్లు కోల్పోయి 25,741.56 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.95 పాయింట్లు కోల్పోయి 7,809 పాయింట్ల వద్ద ముగిశాయి. గడచిన ఏడేళ్లలో స్టాక్‌ మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. సెన్సెక్స్‌ చరిత్రలో చోటు చేసుకున్న భారీ పతనాల్లో మూడవది. 2008 జనవరి 21 తర్వాత అతి పెద్ద నష్టం. 26 వేల పాయింట్ల దిగువకు చేరడం సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.

రైతులకు న్యాయం చేయాలి:దడాల

కోరంగి భూముల ఘటనపై న్యాయం చేయాలని ఎస్‌పి రవిప్రకాష్‌, ముమ్మిడివరం ఎంఎల్‌ఎ దాట్ల బుచ్చిబాబు, కాకినాడ ఆర్‌డిఒ అంబేద్కర్‌లను అఖిలపక్షం నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నాయకుల బృందం ముమ్మిడివరం ఎంఎల్‌ఎను కలిసి ఘటనా వివరాలను, పేదలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనికి స్పందించిన ఆయన పోలీసుల అత్యుత్సాహంపై ఎస్‌పితో మాట్లాడారు. ఆర్‌డిఒకు ఫోన్‌ చేసి భూములపై సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని విచారణ నిర్వహించాలన్నారు. 

SFI నాయకుల విడుదల..

నారాయణ కాలేజీ విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి మృతికి కారణమైన వారిని వదిలేసి, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌ ప్రశ్నించారు. లాఠీలు, తూటాలు, అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవని హెచ్చరించారు. కడప నారాయణ కాలేజీలో విద్యార్థినుల మృతికి నిరసనగా ఆందోళన నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఓబులేసు, జగదీష్‌, సుబ్బారెడ్డి, డివైఎఫ్‌ఐ నాయకులు శంకర్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారు మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మహిళా పాలిటెక్నిక్‌ విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ..

సమ్మెతో కనువిప్పు కలగాలి..

సెప్టెంబర్‌ 2న జరిగే సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా హిందూపురంలో ప్రారంభమైన బస్సు జాతా సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించింది.

 

భారత్‌ పాక్‌ చర్చలే శరణ్యం..ఏచూరి

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలు రద్దుకావడం దురదృష్ట కరమని సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను నివారించాలంటే భారత్‌ చర్చల ప్రక్రియను కొనసాగించాలని ఆయన తెలిపారు. భారత్‌, పాక్‌ మధ్య యుద్దోన్మాదం పెరగడం ఇరువైపుల మత ఛాందసవాద శక్తులు బలోపేతానికి దారితీస్తుందని, ఇది రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతమని, ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు.'వేర్పాటువాదులతో పాకిస్తాన్‌ దౌత్యవేత్తలు చర్చలు జరిపారనే కారణంతో భారత్‌ ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలను రద్దు చేసింది.

Pages

Subscribe to RSS - 2015