2015

అంబేద్కర్‌ గురించి RSS అబద్ధాల పునశ్చరణ!

 'సంబంధిత ప్రజలను మానసికంగా సరైన రీతిలో అర్థంచేసుకుని, సరిపడినంతగా పునశ్చరణ చేస్తే చతురస్రాన్ని వృత్తంగా నిరూపించటం దుస్సాధ్య మేమీ కాదు' అని జోసెఫ్‌ గోబెల్స్‌ చెప్పాడు. మద్రాసు ఐఐటిలోని 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' 'గుర్తింపును రద్దు' చేయటానికి వ్యతిరేకంగా దేశం లోపలా, బయటా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక 'ఆర్గనైజర్‌' ఆగ్రహపూరితంగా నిరసనకారులను కమ్యూనిస్టులుగా పేర్కొంటూ 'తొలిగిన బూటకపు అంబేద్కరిస్టుల ముసుగు' అనే శీర్షికతో గందరగోళపరిచే సంపాదకీయం రాసింది.

దళిత సమస్యలపై చర్చించేందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకై ఉద్యమం..

బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఏడాది పాటు జరుగుతోంది. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చింది. ఎన్నో ఏళ్లగా దళితులకు సంబంధించిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, తదితర వెనుకబడిన సామాజిక తరగతుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దేశంలోని సగటు మానవాభివృద్ధి సూచికలతో పోల్చుకుంటే వీరి పరిస్థితి అంతకంటే అట్టడుగున ఉంది. దళిత, గిరిజన వాడలు అభివృద్ధికి నోచుకోలేదు. ఉపాధి లేక వలసలు పెరిగాయి. ప్రభుత్వ రంగ పతనంతో చదువుకున్న వారికి ఉద్యోగం దొరకటం లేదు.

ప్రభుత్వ భూ దాహం..

శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ప్లాంటుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూములను కేటాయిస్తూ 2009లో 1107 జీవో విడుదల చేసింది. సర్వేనెంబరు 152/2లో 972 ఎకరాల భూమిని ఎన్‌సిసి లిమిటెడ్‌కు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి కేటాయించింది. పవర్‌ప్లాంట్‌ నిమిత్తం కేటాయించిన ఈ భూమికి చెందిన రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆ ప్రాంతంలో వివిధ రూపాలలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నేతాజీ ఫైళ్ల, నిరాధార కథనాలతో హడావుడి

నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ప్రమాద మరణంపై విభిన్న కథనాలకు సంబంధించిన 64 రహస్య ఫైళ్లను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విడుదల చేశారు. రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందనే అంచనాతోనే ఆమె ఈ చర్య తీసుకున్నట్టు మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా అదే విమర్శ చేశాయి. బెంగాలీలు నేతాజీని ఎంతగానో ప్రేమిస్తారు గనక వారి మనోభావాలు చూరగొనేందుకు దీదీ వేసిన తెలివైన ఎత్తుగడగా పత్రికలు అభివర్ణించాయి. అయితే ఆ ఫైళ్లలో కొత్తగా బయిటపడిన విషయాలు ఏమీ లేవని కూడా దాదాపు అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు.

పారిశ్రామికాభివృద్ధితో సంబంధంలేని భూసేకరణ

 రాజధాని నిర్మాణం కోసం సేకరించే భూమి కాక, రాష్ట్రంలో పరిశ్రమల నిర్మాణం కోసం 15 లక్షల ఎకరాల భూమిని సమీకరి స్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అందుకను గుణంగానే వివిధ ప్రాంతాలలో సేకరించ టానికి భూములను గుర్తిస్తున్నది. కొన్ని చోట్ల నోటిఫికేషన్‌ జారీచేసి భూములను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఫారెస్టు భూములు, ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూములు, గతంలో దళితులు, పేదలకు పంచిన పట్టా భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వచ్చే పరిశ్రమలు వేళ్ళ మీద లెక్కబెట్టేటన్ని కూడా లేకపోయినా భూములు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటుండటంతో రైతులు భయాందోళనలతో తల్లడిల్లుతున్నారు.

డ్రాపౌట్స్‌ను పెంచే డిటెన్షన్‌ విధానం..

పాఠశాల విద్యలో డిటెన్షన్‌ విధానం తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. ఆగస్టు 19న ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల విద్యామం త్రుల, అధికారుల సమావేశంలో డిటెన్షన్‌ విధానం ప్రవేశ పెట్టాలని చర్చ జరిగి, రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కోరారు. కేంద్ర విద్యా విషయాల సలహా మండలి (సిఎబిఇ) ఈ మేరకు సిఫార్సు చేసినట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యాశాఖ ఆధ్వర్యం లో మండల, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయు లు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

సంఘ్ సర్కార్‌..

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌), కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర అవగాహన భేటీ లౌకికవాదం, జాతి సమగ్రతలను ప్రశ్నార్ధకం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ సహా పలువురు మంత్రులు సంఫ్‌ు ప్రముఖుల వద్దకెళ్లి తమ ప్రోగ్రెస్‌ రిపోర్టులు సమర్పించడం ద్వారా కేంద్ర సర్కారు ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో నడుస్తోందని చెప్పకనే చెప్పారు. తమ సమావేశం సమాచార మార్పిడి కోసమని ఇరుపక్షాలూ పైకి చెబుతున్నా ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాను అమలు పరచడానికి కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసిన సమావేశమన్నది స్పష్టం.

ఇంత ఉదాసీినతా..?

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">పొగాకు ఉత్పత్తిలో బ్రెజిల్‌, అమెరికా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కర్నాటక, ఎపిలోనే సాగు అత్యధికం. పొగాకుపై ఏడాదికి రూ.20 వేల కోట్ల ఎక్సయిజ్‌ సుంకం, రూ.ఐదు వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి లభిస్తోంది. ఇంత ఆదాయం సమకూర్చిపెట్టడానికి కారకులైన పొగాకు రైతులంటే సర్కారుకు చులకన. వారికి గిట్టుబాటుధర కల్పనపై ఉదాసీనత.

దుర్మార్గం..

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిన తీరు దుర్మార్గం. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీసులు విరుచుకు పడిన తీరే పైనుండి అందిన ఆదేశాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అసాంఘిక శక్తులతోనూ, శత్రు సమూహాలతోనూ వ్యవహరించినట్లు పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించారు. విద్యార్థినులను సెల్‌ ఫోన్లో చిత్రీకరించడం, చున్నీలు గుంజడం, జుట్టు పట్టి లాగడం వంటి చర్యలు పోలీసుల అనాగరిక స్వభావాన్ని వెల్లడిస్తున్నాయి.

Pages

Subscribe to RSS - 2015