2015

ఎక్కడి సమస్యలు అక్కడే.!

 రాజధాని శంకుస్థాపన సంబరాల మధ్య ప్రజా సమస్యలు పక్క కెళ్లిపోతున్నాయి. మంత్రులు, అధి కార యంత్రాంగమంతా కేవలం రాజధాని శంకు స్థాపన మీదే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రాధాన్య అరశాలపైనా ఎవరూ స్పరదిరచడం లేదు. వివిధ జిల్లాల్లో రోజూ సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు.దాదాపు అన్ని శాఖల్లోనూ ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.

నష్టపరిహారం ఏది?: నర్సింగరావు

హుదూద్‌ ఏడాది సంబరా లను విశాఖలో జరిపిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు నష్టపరి హారంపై సమాధానం చెప్పకుండా దాటవే యడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌. నర్సింగరావు వ్యాఖ్యానిం చారు.విశాఖ స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై బహిరంగ విచారణకు సిద్ధమేనా? అంటూ సవాల్‌ చేశారు. తుపానులో ఇళ్లు కోల్పోయిన అత్యధిక మంది బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోగా, దాతలిచ్చిన విరాళాలతో కూడా ఇళ్లు నిర్మించకుండా ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. అత్యధిక మంది మత్స్యకారులకు, గిరిజనులకు, రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వలేదన్నారు. 

రసాయన కర్మాగారం ఏర్పాటుపై భయాందోళన

బిసి ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌లిమిటెడ్‌ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం లో నిర్మించ తలపెట్టిన ఎరువులు, రసాయనాల కర్మాగారంపై గురువారం నాడు ఫార్సుగా ప్రజాబి ప్రాయ సేకరణ జరిగింది. ప్లాంటుకు సంబంధిం చి నామమాత్రపు వివరాలు కూడా ఇవ్వకుండా అభి ప్రాయాలు సేకరించడంపై తీవ్రస్థాయిలో విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమీప బంధువులకు ఈ ప్లాంటులో భాగస్వామ్యం ఉండటంతో హడావిడిగా ఈ తంతు ముగించా రన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారో, ఎవరి నుండిసాంకేతిక సహకారం తీసుకుంటున్నారో వంటి అంశాలను కూడా ప్రజల కు వివరించకపోవడం గమనార్హం. 

కడప కలెక్టరేట్ ముట్టడి..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు పీడిత ప్రాంత మైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం  ఆధ్వర్యం లో  పెద్దఎత్తున కడప కలెక్టరేట్ను ముట్టడించారు.ధర్నాకు వస్తున్న ప్రజలనూ, పార్టీ కార్యకర్తలనూ, నాయకులనూ పోలీ సులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ధర్నానుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ..రాయలసీమలో విద్య, ఉపాధితోపాటు వర్షాలు లేక అన్నిట్లోనూ వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిషన్‌ తన రిపోర్టులో పేర్కొందని గుర్తు చేశారు.

రాజ్యంలో మతం - మతంతో రాజకీయం

భారత్‌ ''భిన్నత్వంలో ఏకత్వం'' ఉన్న దేశం. మన గొప్పతనానికి, ప్రజల ప్రశాంత జీవనానికి అదే కారణం. భిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కతుల మధ్య భాసిల్లిన భారతీయతకు ఇప్పుడు భంగం వాటిల్లింది. ''రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాక పోతే అది చెడుగా మారు తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచి వారైతే మంచిదిగా మారుతుంది'' అని డాక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం భారత దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. లౌకికవాదానికి నిఘంటువులు ''ఈ భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికం కాని, మతాతీతమైన'' అనే అర్థాలనిచ్చాయి.

UPఘటనపై అట్రాసిటీకేసు:VSR

ఉత్తరప్రదేశ్‌లోని దళితులపై దాడి చేసిన దన్కౌర పోలీస్టేషన్‌ అధికారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిఎస్‌ఎంఎం జాతీయ నేత వి.శ్రీని వాసరావు డిమాండు చేశారు. దళిత కుంటుంబంపై జరిగిన దాడిన నిరసిస్తూ బుధవారం దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో కార్యకర్తలు ఢిల్లీలోని యూపి భవన్‌ను ముట్టడికి యత్నిస్తే ఢిల్లీ పోలీసులు అనుమతి లేదని మధ్యలోనే అడ్డుకున్నారు. కేంద్ర, యూపి ప్రభుత్వాలకు వ్యతిరే కంగా పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు.

అభివృద్ధి కేంద్రీకరణ తగదు:BVR

రాజధాని నిర్మాణం పూర్తిగా కార్పొరేట్ల కోసమే చేస్తున్నట్లుందని, రైతుల ప్రస్తావన, వారి సంక్షేమం కనిపించడం లేదని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను గ్రీన్‌ఫీల్డు పేరు తో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుం డా ఏకపక్షంగా ముందుకు వెళుతూ వ్యాపార రాజధానిగా మారుస్తున్నారన్నా రు. రాజధాని కార్పొరేట్ల కోసమా ? ప్రజల కోసమా ? అనే అంశంపై బుధవారం వేదిక ఫంక్షన్‌ హాల్లో సిపిఎం ఆధ్వర్యాన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వ్యాపారం కోసమే రైతుల వద్ద వేల ఎకరాల భూములు తీసుకున్నారని తెలిపారు.

బహుళజాతి కంపెనీపై తొలి తిరుగుబాటు

ఎత్తయిన గోడలు, చుట్టూ ముళ్ల కంచెలు, ఈగ సైతం లోపలకు వెళ్లలేనంతగా భద్రత... ఇదీ... ఓలం ఆగ్రా ఇండియా లిమిటెడ్‌ (ఒఎఐఎల్‌) బహుళజాతి కంపెనీ విశాఖ జిల్లాలో ఏర్పాటైన ప్రాంతం... అధికారంలో ఉండే రాజకీయ నాయకుల అండదండలు, కార్మిక శాఖ ఉన్నతాధికారుల చల్లని చూపులు రక్షణ కవచాల్లా ఓలం కంపెనీకున్నాయి. ఈ స్థితిలో లోపల ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి. విశాఖ జిల్లాలో శాఖోపశాఖలుగా విస్తరించిన ఓలం జీడిపిక్కల కంపెనీ అన్ని కార్మిక చట్టాలనూ తుంగలో తొక్కుతూ పబ్బం గడుపుకుంటోంది...
90 శాతం మహిళా శ్రామికులే...

Pages

Subscribe to RSS - 2015