నష్టపరిహారం ఏది?: నర్సింగరావు

హుదూద్‌ ఏడాది సంబరా లను విశాఖలో జరిపిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు నష్టపరి హారంపై సమాధానం చెప్పకుండా దాటవే యడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌. నర్సింగరావు వ్యాఖ్యానిం చారు.విశాఖ స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై బహిరంగ విచారణకు సిద్ధమేనా? అంటూ సవాల్‌ చేశారు. తుపానులో ఇళ్లు కోల్పోయిన అత్యధిక మంది బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోగా, దాతలిచ్చిన విరాళాలతో కూడా ఇళ్లు నిర్మించకుండా ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. అత్యధిక మంది మత్స్యకారులకు, గిరిజనులకు, రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వలేదన్నారు.