2015

అమరావతి పనులు ఆపండి:NGT

పర్యావరణ అనుమతులకు ఆమోదం లభించకుండా ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులూ(నేల చదును, నిర్మాణాలు చేపట్టడం) చేయకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జిటి) ఆదేశాలిచ్చింది. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని చిత్తడి నేలలు, ముంపు ప్రాంతాల గుర్తింపుపై పూర్తి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపాదిత రాజధాని నిర్మాణ స్థలంలోని ముంపు ప్రాంతాలకు సరిహద్దులు నిర్ణయించాలని సూచించిన ట్రిబ్యునల్‌... అందులో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దాద్రీ ఘటనపై SFI ఆగ్రహం..

దాద్రీ ఘటనపై దేశ రాజధానిలోని విద్యార్థిలోకం కదం తొక్కింది. జెఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా వర్సిటీలకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు మార్చ్‌ నిర్వహించాయి. ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ అసోసియేషన్‌, ఎస్‌ఎఫ్‌ఐ, తదితర వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఫిరోజ్‌ షా రోడ్‌ కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాద్రీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని ఘటన వెనుక ఉన్న కుట్రదారులకు శిక్ష పడేలా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 

అవి మతోన్మాద ప్రణాళికలే:ఏచూరి

అగర్తలా : ఘర్‌వాపసీ, లవ్‌ జిహాద్‌, గో రక్ష వంటివి BJP మతోన్మాద ప్రణాళికలేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని, ఆరెస్సెస్‌ రాజకీయ ఆయుధం బిజెపి అని ఆయన అన్నారు. మోడీ పాలనలో పౌరాణిక గాథలతో భారత చరిత్రను నింపే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ గజల్‌ గాయకుడు గులామ్‌ అలీ కార్యక్రమాన్ని శివసేన అడ్డుకోవటాన్ని ఏచూరీ తీవ్రంగా ఖండించారు.

క్షీణిస్తున్న జగన్‌ ఆరోగ్యం

ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్‌ చేపట్టిన నిరవధిక దీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్‌ లెవల్స్‌, పల్స్‌ రేటు పడిపోవడంతోపాటు బరువు తగ్గుతున్నట్లు వైద్యులు నిర్ధారించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీక్షా శిబిరానికి వచ్చిన జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ముంబైలో శివసేన పైశాచికత్వం..

ముంబైలో శివసైనికులు మరోసారి రెచ్చిపోయారు. అబ్జర్వర్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుదీంధ్ర కులకర్ణిపై దాడికి దిగారు. శివసైనికులు సుదీంధ్ర ముఖానికి నల్ల రంగు పూశారు. పాకిస్థాన్‌ కు చెందిన విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షీ మహ్మద్‌ కసూరీ రచించిన పుస్తకం ఆవిష్కరణను ముంబైలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని సుదీంధ్ర కులకర్ణి నిర్వహిస్తున్నారు. పాకిస్థానీ రచయిత పుస్తకావిష్కరణ ముంబైలో నిర్వహించ వీల్లేదని శివసేన హుకూం జారీ చేసింది. కాగా ఇదే విషయమై చర్చించేందుకు సుధీంధ్ర శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రేను కలిశారు. వీరిరువురి చర్చలు విఫలం అయ్యాయి.

శంకుస్థాపనకి రూ400 కోట్లా?:మధు

 నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలియజేసారు .. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. చంద్రబాబు.. రోజు వారి ఉపన్యాసాలు వింటుంటే నిజాయితీ నశించిందని అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కాదు...ప్యాకేజీలున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. కనీస నిజాయితీ లేదని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో నిజాయితీ లేదని విమర్శించారు. పీఆర్సీ 2013 అమలు జరగాల్సి ఉంటే 2014 నుండి అమలు చేస్తామని తెలిపారు.

ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం:కాశీనాథ్

విజయవాడలో డెంగ్యు , విషజ్వరాలతో ప్రజలు భాధ పడుతున్నా పాలకవర్గానికి  చీమకుట్టినట్లయినా లేదని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఘాటుగా విమర్శించారు.సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు..

 జిల్లాకు ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా కపోవడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక వరం లాగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షలాది ఎకరాలు పంట భూములుగా సాగులోకి తీసుకురావచ్చునని ప్రకటిస్తున్నారు. కానీ ఇది ఆచరణలో ఎంత సాధ్యమో గత దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పార్టీలు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమౌతుంది.

జాతీయ కమిషన్కు ఐద్వా లేఖ

పశ్చిమ బెంగాల్‌ పోలీసులు అక్టోబర్‌ 1న జరిపిన లాఠీచార్జ్‌ విషయంలో ఐద్వా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ మహిళా కమిషన్‌కు ఐద్వా లేఖలు రాసింది. కోల్‌కతా జిల్లా లెఫ్ట్‌ఫ్రంట్‌ కమిటీ ఆధ్వర్యంలో లాల్‌బజార్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించగా పోలీసులు అకారణంగా లాఠీచార్జ్‌ చేశారన్నది తెలిసిందే. ఈ లాఠీచార్జ్‌లో చాలా మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఐద్వా ఈ లేఖలలో వివరించింది. ఐద్వా అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్‌లు ఈ లేఖలను మీడియాకు విడుదల చేశారు.

ఇక్కడే పుట్టాం..ఇక్కడే చస్తాం

దాద్రీ ఘటన నేపథ్యంలో ఊరు విడిచి వెళ్లే ఆలోచన ఏదీ లేదని అఖ్లాక్‌ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. బిషారా విడిచి వెళుతున్నట్లు వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చారు. 'మేము ఎక్కడి కీ తరలివెళ్లలేదు. వెళ్లము. దీనికి సంబంధించి వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యానికి గురయ్యాను' అని అఖ్లాక్‌ తనయుడు సర్తాజ్‌ వ్యాఖ్యానించారు. 'గ్రామం విడిచి వెళ్లడంపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది మా సొంత ఊరు. మాతృభూమి. మేము ఇక్కడే పుట్టాం. ఇక్కడే తుది శ్వాస విడుస్తాం. మేమెందుకు గ్రామం విడిచివెళ్లాలి' అని సర్తాజ్‌ ఆవేదనతో వ్యాఖ్యానించారు. 

Pages

Subscribe to RSS - 2015