September

బిజెపి విధానాలను ప్రతిఘటిద్దాం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

దేశంలో పాలనంతా అంబానీ, అదానీలకు మోడీ ఇచ్చిన వాగ్దానాల చుట్టే తిరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి డొలిచేస్తోంది. మోడీని గద్దెదింపే అతి పెద్ద పోరాటం దేశంలో సమీప భవిష్యత్తులో విశాఖ నుంచే ఉంటుంది' అని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. 'బిజెపి విధానాలను ప్రతిఘటిద్దాం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం' అనే నినాదంతో  విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కాన్వోకేషన్‌ హాల్‌లో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

స్టేట్ గెస్ట్ హౌస్ స్థలం అమ్మకంపై నిరసన

విజయవాడ లెనిన్ సెంటర్ లో స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ,స్టేట్ గెస్ట్ హౌజ్ సందర్శన... ఒక వైపున కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే, మరోవైపున రాష్ట్రప్రభుత్వం విలువైన ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు.విజయవాడ నగరంలో రాజ్ భవన్ సమీపంలో వందలాది కోట్ల రూపాయల విలువైన స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని బిల్డ్ ఏపీ పేరుతో తెగ నమ్మటం సిగ్గుచేటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మకాన్ని వ్యతిరేకించిన వైసిపి నేడు అధికారంలో రాగానే మాట మార్చి అమ్మకానికి పెడుతోంది.ప్రజల ఆస్తులు అమ్మకాన్ని వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తాం, ప్రజల ఆస్తులు కాపాడుకుంటామని 

Pages

Subscribe to RSS - September