September

హిందూత్వ హింస, దోపిడీకి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్‌వాదం

నేడు దేశవ్యాప్తంగా హింస, సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ మతం పేరుతో జరుగుతున్నాయి. దేశం ఆర్థికంగా కుంగిపోవ డానికి, సమాజం నేరస్థంగా మారడానికి కారణం హిందూవాదమే. హిందూవాదం హింసావాదం, అణచివేతవాదం, అమానవవాదం. హిందూత్వ పేరిట నేడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌ మైనార్టీలు, దళితులపై జరుపుతున్న దాడులు మోడీ జీవన శైలిలో ఉన్న పయోముఖ విషకుంభత్వాన్ని బయట పెడుతున్నాయి.

టెలికం కంపెనీల ‘షేరింగ్’ రూట్

టెలికం కంపెనీలు అదనపు వ్యయ భారం లేకుండా ఇచ్చి పుచ్చుకునే విధానంలో కవరేజీ సేవలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నెట్‌వర్క్ షేరింగ్ కోసం చేతులు కలుపుతున్నాయి. వొడాఫోన్, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌తో టై అప్ అయిన మరుసటి రోజే రిలయన్స్ జియో సైతం బీఎస్‌ఎన్‌ఎల్‌తో నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం చేసుకుంది. 

బాబు డెరైక్షన్.. కాంగ్రెస్ యాక్షన్

తెలంగాణ  సాగునీటి ప్రాజెక్టులు అడ్డుకునే కుట్రలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డెరైక్షన్ మేరకే.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు యాక్షన్ చేస్తున్నారని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఆపాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. వారితో చెట్టాపట్టాలేసుకొని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి వంటి నేతలు ధర్నాలకు దిగడమే ఇందుకు నిదర్శనమన్నారు.

అణచివేతలు చెల్లవు : సిపిఎం

చంద్రబాబు ప్రజలపై అణచివేత చర్యలకు, నిర్బంధానికి పాల్పడుతున్నారని, మరింత పెద్ద ప్రజాఉద్యమంతో వాటిని ఎదుర్కొంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందన్నారు. తుందుర్రు - కంసాలి బేతపూడి మధ్య ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. 30 నుంచి 40 గ్రామాల ప్రజలు ఆధారపడిన గొంతేరు కాలువను ఆక్వా ఫుడ్‌ పార్కు పూర్తిగా కలుషితం చేస్తుందన్నారు. స్థానికులు రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 

కావేరి వివాదంపై మోదీస్పందన..

కావేరి నదీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఇరురాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని, సామాజిక బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు

సీపీఎం నేతల ఆత్మీయ సమావేశం

విశాఖపట్టణంలో సీపీఎం నేతల ఆత్మీయసమావేశం జరిగింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల సీనియర్ సీపీఎం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్ బీవీ.రాఘవులతో పాటు సీనియర్ నేత చౌదరీ తేజేశ్వరావు, సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు నర్సింగరావు, సీపీఎం నేతలు పుణ్యవతి, ఎంవీఎస్.శర్మ ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల నుంచి విద్యార్ధి , కార్మిక, వామపక్ష ఉద్యమంలో పాలుపంచుకున్న మిత్రులందరం ఓసారి కలుసుకుని ఆ పాత జ్ఞాపకాలను పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు తెలిపారు.

ప్యాకేజీ పేరుతో భ్రమలు:ఏచూరి

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదనీ, ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలుపుకోవడం లేదో కేంద్రం చెప్పాలన్నారు.

ఆక్వా ఫుడ్ పార్క్ ,దివీస్ కు వ్యతిరేకంగా పోరాడుతాం

 కాకినాడలో దివీస్ పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.దివీస్ కంపెనీకి భూములు ఇవ్వని రైతులపై కిరాతకంగా దాడులు చేయడం దారుణమన్నారు. సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చే భూములకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదని తెలిపారు.రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని ఎద్దేవా చేశారు. తుండూరు ఆక్వాఫుడ్‌ పార్క్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో 37 వేల ఎకరాల భూమిని సేకరించారని.. అందులో 1 శాతం భూమి కూడా వినియోగంలోకి రాలేదన్నారు.

ఏపీ హోదాపై ప్రజా బ్యాలెట్..

ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు మంగళం పాడి.. ఓ బోగస్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని బయట పెట్టేందుకు ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించన్నుట్లు చెప్పారు.

Pages

Subscribe to RSS - September