November

అనంత‌లో జ‌న‌సేనా పార్టీ స‌భ‌...

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న‌ కరువుపై పవన్ కల్యాణ్ స్పందించనున్నారు. 

అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఎన్నిక

అమెరికా అధ్య‌క్ష రేసుకు రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీప‌డ్డ ట్రంప్ అనూహ్య రీతిలో అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్నారు. 45వ అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక‌య్యారు. జ‌న‌వ‌రి 20వ తేదీని ఆయ‌న అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలున్నాయి.

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

సర్వేల అంచనాలను తలదన్నేలా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దూకుడు, రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం భారత స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా కుదేలైంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. 

ఈ పాపం ఎవరిది?

'ఒక ర్యాంకు ఒకే పింఛను' (ఓఆర్‌ఓపి) అమలు కోసం రిటైర్డు ఆర్మీ సుబేదార్‌ ఆత్మహత్య, తదనంతర పరిణామాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. జై జవాన్‌ అని నినదించిన గడ్డపైనే దేశానికి సేవ చేసిన జవాన్లు అత్యంత దయనీయమైన రీతిలో తనువు చాలించే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి చనిపోయిన రిటైర్డు సుబేదార్‌ మానసిక స్థితి ఏమిటో మొదట పరిశీలించాలని వికె సింగ్‌ వంటి మంత్రులతో ప్రకటనలు ఇప్పించడం అత్యంత గర్హనీయం.

సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఎన్నిక చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఆయన ఎంపిక తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆయన కేవలం మాలమహానాడు అధ్యక్షుడు మాత్రమేనని, ఆయనను ఇలాంటి కమిషన్‌కు ఎంపిక చేయడం ఏంటన్న వాదనలు వినిపించాయి. 

ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకోను

ఈ ఏడాదికి గానూ ఉత్తమ జర్నలిస్టులకిచ్చే ప్రతిష్టాత్మక రామ్‌నాథ్‌ గోయంకా అవార్డును ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా తీసుకునేందుకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా జర్నలిస్టు అక్షయ ముకుల్‌ తిరస్కరించారు. ముకుల్‌కు నాన్‌ ఫిక్షన్‌ బుక్స్‌ విభాగంలో రామనాథ్‌ గోయంకా అవార్డు లభిం చింది. హిందూత్వ సైద్ధాంతిక పునా దులపై ఈ పుస్తకం వెలువడింది. అయి తే అవే సిద్ధాంతాలతో ప్రధాని రాజకీ యాలు సాగుతున్న క్రమంలో ము కుల్‌ అవార్డుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని కారవాన్‌ వెబ్‌సైట్‌తో జర్నలిస్టు సందీప్‌ భూషణ్‌ చెప్పారు.

JNU ఉద్యమాన్ని ఉధృతం చేయండి

జేఎన్‌యూలో అదృశ్య మైన విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ను వెతికిం చడంలో జేఎన్‌ యూ వీసీ అలసత్వం ప్రదర్శి స్తున్నారని ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో సహా పలువురు వక్తలు ఆరోపించారు.జేఎన్‌యూ వెలుపల మీ ఆందోళనను కొనసాగించండి' అని విద్యార్థులకు కేజ్రీవాల్‌ సూచించారు. 'ఇండియా గేట్‌ వద్ద కూర్చోండి. నజీబ్‌ కోసం పోరాడేందుకు యావత్‌ దేశ మద్దతు కోరండి. నేను మీతో ఉన్నాను. ఆందోళనలో నేను కూడా భాగస్వామి అవుతాను' అని కేేజ్రీవాల్‌ అన్నారు.

ప్రభుత్వం దివీస్‌ కంపెనీకి తొత్తుగా..

తూర్పుగోదావరి జిల్లా తొండంగి ప్రాంతంలో దివీస్‌ కంపెనీకి బలవంతంగా భూములు సేకరించడాన్ని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు ఈరోజు విశాఖలోని జీవీఎంసీ గాంధీ వగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూసేకరణ జరిపి రైతులను ఒత్తిడికి గురి చేస్తున్నా్నరని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు సేకరించి వాటిని ప్రైవేటు కంపెనీలకు అక్రమంగా కట్టబెడితే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం దివీస్‌ కంపెనీకి తొత్తుగా వ్యవహరిస్తూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని ఆరోపించారు.

స్పష్టత లేని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఎలాంటి స్పష్టత లేకుండా ముగిసింది. దీంతో పెండిగ్‌ సమస్యలపై నెల 20న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. జీఎస్టీకి సంబంధించి ఇప్పటివరకు 10 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు.

సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ

మధ్యప్రదేశ్‌లోని జైలు నుంచి తప్పించుకున్న ఎన్‌కౌంటర్‌కు గురైన సిమి ఉగ్రవాదుల ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టీస్ ఎస్‌కే పాండే ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతుందని గురువారం రాత్రి వెల్లడించిన అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

Pages

Subscribe to RSS - November