మధ్యప్రదేశ్లోని జైలు నుంచి తప్పించుకున్న ఎన్కౌంటర్కు గురైన సిమి ఉగ్రవాదుల ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టీస్ ఎస్కే పాండే ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతుందని గురువారం రాత్రి వెల్లడించిన అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.