ప్రభుత్వం దివీస్‌ కంపెనీకి తొత్తుగా..

తూర్పుగోదావరి జిల్లా తొండంగి ప్రాంతంలో దివీస్‌ కంపెనీకి బలవంతంగా భూములు సేకరించడాన్ని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు ఈరోజు విశాఖలోని జీవీఎంసీ గాంధీ వగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూసేకరణ జరిపి రైతులను ఒత్తిడికి గురి చేస్తున్నా్నరని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు సేకరించి వాటిని ప్రైవేటు కంపెనీలకు అక్రమంగా కట్టబెడితే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం దివీస్‌ కంపెనీకి తొత్తుగా వ్యవహరిస్తూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని ఆరోపించారు.