May

మోడీ డిగ్రీ చేసినట్టు ఆధారాలు లేవు..

 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ చేసినట్టు ఆధారాలు లేవని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. 1975 నుంచి 1980 వరకు ఢిల్లీ యూనివర్సిటీ ఫైళ్లను తాము పరిశీలించామని కానీ నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ అనే పేరు గల వ్యక్తి డిగ్రీ చేసినట్టు తమకు ఎలాంటి ఆధారాలూ లభించ లేదని ఆప్‌ నేత ఆశిష్‌ ఖేతన్‌ తెలిపారు. రాజ స్థాన్‌లోని అల్వార్‌ నివాసి అయిన నరేంద్ర కుమార్‌ మహవీర్‌ ప్రసాద్‌ మోడీ అనే వ్యక్తి 1975 -78 కాలంలో డిగ్రీ చేసినట్టు యూనివ ర్సిటీ ఫైళ్లలో ఉన్నదని దానికి నరేంద్ర మోడీ చూపిన డిగ్రీకి పోలికలు లేవని ఆయన తెలిపారు.

ఎరువుల సబ్సిడీకి కూడా నగదు బదిలీ..

ఆరోగ్య బీమా పధకాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఎరువులకు సంబంధించిన సబ్సిడీ లను కూడా ఈ పథకానికి జత చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. 
ఎరువుల కొను గోలుపై సబ్సిడీని నగదు బదిలీ ద్వారా రైతులకు నేరుగా అం దచేసే విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమ లుచేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి జయంత్‌ సిన్హా చెప్పా రు. 

33 మందిపై మోడీ వేటు..

మోడీ ప్రభుత్వం 33మంది రెవెన్యూ అధికారులను విధుల నుంచి తొలగించింది. అందులో ఆరుగురు గ్రూప్‌ ఏకు చెందిన అధికారులు ఉండడం గమనార్హం. ఆరుగురు గ్రూపు ఏ అధికారులతో సహా ఇతర శాఖల అధికారులను విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న కారణంతో ముందస్తుగా పదవి నుంచి విరమింపజేసినట్టు ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రెండు సంవత్సరాల్లో 72 మంది అధికారులను విధుల్లో నుంచి తొలగించినట్టు పేర్కొంది.

జేఎన్‌యూపై రాష్ట్రపతి జోక్యానికి వినతి

జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ దమన వైఖరిపై ప్రతిపక్ష ఎంపీల బృందం శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. కాగా విద్యార్థుల దీక్షలు నేడు 10వ రోజుకు చేరుకున్నాయి. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కన్నయ్యకుమార్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

సింగపూర్‌, జపాన్‌ వ్యాపారస్తుల‌ కోసం పేదల ఇళ్ళు క్చూడం అన్యాయం. సి.పి.ఎం. ధర్నా

కృష్ణా పుష్కరాల పేరు చెప్పి ఘాట్‌ను నిర్మిస్తామని, ప్రజల ఇబ్బందును తొల‌గించేందుకు ఇళ్ళు తొల‌గించాల్సి వస్తుందని మాయమాటలు చెబుతున్న తెలుగుదేశం ఈ ప్రాంతంలో పర్యాటక రంగం పేరుతో సింగపూర్‌, జపాన్‌కంపెనీల‌ వ్యాపారాల కోసం పేదల ఇళ్ళు కూల్చ‌డం అన్యాయం.  వెంటనే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాల‌ని కోరుతూ కరకట్టవాసులు శుక్రవారం ఉదయం సైన్స్‌సెంటర్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు శ్రీ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ కృష్ణాపుష్కరాల‌కు నిజంగా ఇళ్ళు తొగించాల్సిన అవసరంలేదు.

దోషులను బోనులో నిలబెట్టాలి

అగస్టా కుంభకోణం, కాగ్‌ తవ్వితీసిన గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జిఎస్‌పిసి) అవినీతి భాగోతంపై పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభాకార్యక్ర మాలను స్తంభింపజేశాయి. ఈ రెండు కుంభకోణాల్లోను ఆవిరైన ప్రజాధనాన్ని మెక్కిన వారిచే కక్కించేందుకు దీనిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిగితే ఉపయోగకరంగా వుండేది. కానీ, పసలేని వాదనలతో సభను అడ్డుకోవడం ఈ కుంభకోణాల్లో దోషులను కాపాడడానికే పనికొస్తుంది.

ఢిల్లీలో లోక్‌తంత్ బచావో యాత్ర

 ప్రధాని మోదీ ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు ఢిల్లీలో లోక్‌తంత్ బచావో యాత్ర పేరుతో ర్యాలీని చేపట్టింది. అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షను నిర్వహించింది. దీక్షలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా మాట్లాడారు. రోజుకు దేశవ్యాప్తంగా 50 మంది రైతులు ఆత్మహత్య మోదీ అచ్చేదిన్ ఆయేగా అంటే ఇదేనా అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. 40 శాతం భూభాగం కరువుతో అల్లాడుతోందన్నారు.

బిజెపి ద్రోహంపై టిడిపి వైఖరేంటి?:మధు

ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన బిజెపితో అనుబంధంపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాను సాధిస్తామని, రాష్ట్రాభివృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇందుకు ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి సిద్ధమైతే, సిపిఎం సహకారం అందిస్తుందని చెప్పారు.

CCDMC స్థానే అమరావతి అభివృద్ధి కంపెనీ

రాజధాని ప్రాంత, అమరావతి నగర అభివృద్ధి పనుల ప్రణాళిక, నియంత్రణ అధికారాన్ని ప్రభుత్వం ఎపిసిఆర్‌డిఎకు అప్పగించింది. అమరావతి అభివృద్ధి కంపెనీ (ఎడిసి)గా మారిన రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ సంస్థ (సిసిడిఎంసి)కు 217 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన రాజధాని నగర మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజరుజైన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిసిడిఎంసి పేరును అమరావతి అభివృద్ధి కంపెనీ (ఎడిసి)గా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం సూచించింది.

సిపిఎం నేతలను ముందస్తు అరెస్టు..

ముఖ్యమంత్రి పర్యటనలకొచ్చినప్పుడల్లా సిపిఎం నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం, వారిని పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం ప్రభుత్వ రివాజుగా మారింది. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి. తాజాగా గురువారం విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అరెస్టుల పర్వం కొనసా గింది.సిపిఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తిసహా పలువురు సిపిఎం నేతలను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు పోలీసులు కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆయనను ఉన్న పళంగా అరెస్టు చేశారు. ఈ అక్రమాన్ని కుటుంబ సభ్యులు నిలదీసినా పోలీసులు ఆయనను విడిచి పెట్టలేదు.

Pages

Subscribe to RSS - May