అగస్టా కుంభకోణం, కాగ్ తవ్వితీసిన గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జిఎస్పిసి) అవినీతి భాగోతంపై పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభాకార్యక్ర మాలను స్తంభింపజేశాయి. ఈ రెండు కుంభకోణాల్లోను ఆవిరైన ప్రజాధనాన్ని మెక్కిన వారిచే కక్కించేందుకు దీనిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిగితే ఉపయోగకరంగా వుండేది. కానీ, పసలేని వాదనలతో సభను అడ్డుకోవడం ఈ కుంభకోణాల్లో దోషులను కాపాడడానికే పనికొస్తుంది.