May

రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేనట్టే..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ యాత్ర మరోసారి బెడిసికొట్టినట్లే కనిపిస్తోరది. షరా మామూలుగానే ఈసారీ ప్రధాని మోడీ ముఖం చాటేశారని అధికారులంటున్నారు. బిజెపి మంత్రు లు, నేతలు చెబుతున్న మాటలనే ఈసారి మోడీ కూడా అంతర్లీనంగా వ్యక్తీకరిరచినట్లు విశ్లేషిస్తున్నా రు. ప్రధానిని గట్టిగానే అడిగామని, సాయం వస్తురదని చంద్రబాబు చెబుతున్నప్పటికీ, వాస్తవాని కి అనుకూల సంకేతాలు రాలేదంటున్నారు. చంద్రబాబు పర్యటనలో వాస్తవ షెడ్యూల్‌గా ఉన్న కరువుపై మన మంత్రులు, అధికారులు పెద్దగా స్పరదిరచలేదని స్పష్టమవుతోరది. 

దోపిడీలేని సమాజం కోసం ఉద్యమం......

పుచ్చలిపల్లి సుందరయ్య స్ఫూర్తితో దోపిడీ, పీడనలేని సమాజం కోసం ప్రజలంతా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపు నిచ్చారు. విజయనగరం పట్టణంలోని ఎల్‌బిజి నగర్‌లో సుందరయ్య వర్థంతి సభను గురువారం నిర్వహించారు. నాయకులు పి.రమణమ్మ అధ్యక్షతన అనంతరం జరిగిన సభలో కృష్ణమూర్తి మాట్లాడారు. సుందరయ్య సంపన్న కుటుంబలో పుట్టినప్పటికీ సమాజంలో కులతత్వాన్ని, దోపిడీని చిన్నప్పుడే వ్యతిరేకించారన్నారు. పేదలు, కష్టజీవులు, సామాన్యులు, మహిళలు ఆత్మగౌరవంతో బతికే వ్యవస్థ కోసం కృషి చేశారన్నారు. ప్రతిఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ అందాలన్న లక్ష్యంతో చివరి వరకూ పనిచేశారని చెప్పారు.

హామీలను అమలు చేయాలని ధర్నా

చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే జిల్లాలలో పర్యటించాలని లేదంటే చంద్రబాబు నాయుడు పర్యాటనను అడ్డుకుంటామని సిపిఎం నాయకులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నాకార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఏ జిల్లా పర్యటనకు వెళ్లిన అక్కడ సమస్యలను పరిష్కరించాలని కోరిన వారిని అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని..తాము సిపిఎం గా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని జిల్లా కార్యదర్శి శేషబాజ్జి తెలియజేశారు.

న్యాయవ్యవస్థ లక్ష్మణరేఖ గీసుకోవాలి:జైట్లీ

న్యాయ వ్యవస్థ తనకు తాను లక్ష్మణరేఖ గీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సూచించారు. స్వతంత్రత పేరుతో ఇతర విభాగాల్లో జోక్యం చేసుకోవడం తగదని జైట్లీ అన్నారు. చట్టాల ను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని, అయితే..విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం శాసన వ్యవస్థదేనని ఆయన స్పష్టం చేశారు. 

జయ, మమతకు మళ్లీ పట్టం

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు సోమవారం పోలింగ్‌ ముగియడంతో గత రెండు మాసాలుగా ఐదు రాష్ట్రాల్లో పలు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు రావడానికి మరో మూడు రోజులు మిగిలివున్న నేపథ్యంలో సోమవారం పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌ ఫలితాలు వెలువడ్డాయి. కేరళలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పాలక యుడిఎఫ్‌ను కూలదోసి సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ విజేతగా ఆవిర్భవిస్తుందని సి ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి.

హామీ లభిస్తేనే భారత్‌కు తిరిగొస్తా!

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల తిరిగి చెల్లింపు విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్‌ అధినేత విజరు మాల్యా భారత్‌కు వచ్చేందుకు పూర్తి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. గత శుక్రవారం ముంబయిలో జరిగిన 'యునైటెడ్‌ బ్రూవరీస్‌' (యూబీఎల్‌) బోర్డు సమావేశంలో మాల్యా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భద్రతకు, స్వేచ్ఛకు హామీ లభిస్తే భారత్‌కు తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారని తెలుస్తోంది.

దామాషా పద్ధతిలో నీటివాటా రావాలి..

కృష్ణా, గోదావరి నదులపై ఎగువన తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందని వైసీపీ అధ్యక్షులు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో మూడు రోజుల పాటు చేపట్టే జలదీక్షను సోమవారం నంద్యాల చెక్‌పోస్టు దగ్గర వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జగన్‌ మాట్లాడారు. ఒక్క నీటి బొట్టు కూడా అక్రమంగా మళ్లింపునకు గురి కాకుండా 15 రోజులకోసారి నీటిని సర్దుబాటు చేసేలా దామాషా పద్ధతిలో నిబంధన ఉండాలన్నారు.

మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌

 తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలలో నిల్చున్నవారందరికీ ఓటు హక్కు విని యోగించుకునేందుకు అధికారులు అనుమతిం చారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్‌ శాతం తగ్గడం విశేషం.

ఎపి సమస్యలపై సిఎం ప్రజంటేషన్

ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో అధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరవు, ఇతర అంశాలపై ప్రధాని మోదీకి సీఎం ప్రంజటేషన్‌ ఇవ్వనున్నారు.

డీజిల్‌పై రూ.1.26,పెట్రోల్‌పై 83 పైసలు,

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పెరిగింది. పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.63.02కు, డీజిల్ ధర రూ.51.67కు పెరిగింది.
 

Pages

Subscribe to RSS - May