May

రైవాడ నీటిని విశాఖకు తరలిస్తే ఊరుకోం

               విశాఖలో మంచినీటి వ్యాపారం కోసం రైతుల పొట్టగొట్టి రైవాడ నుంచి అదనంగా 150 క్యూసెక్కుల నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న హెచ్చరించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో రైతులతో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైవాడ నుంచి విశాఖకు అదనంగా నీటిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రైవాడ నీటిని రైతులకే పూర్తిగా అందిస్తామని, రిజర్వాయర్‌ను రైతులకు అంకితం చేస్తామని అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, అదనంగా నీటిని తరలించుకుపోవడానికి నిర్ణచయించడం దారుణమన్నారు.

తొలగించిన 'ఓలం' కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

               ఓలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన 9 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అమలాపురం ఫ్యాక్టరీ కార్మికులు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నర్సీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రాజు మాట్లాడుతూ నర్సీపట్నం మండలం అమలాపురంలోని ఓలం జీడిపిక్కల కర్మాగారంలో 13 సంవత్సరాల నుండి మహిళలు, అనేక మంది కార్మికులుగా పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో 9 మందిని మార్చి 20వ తేదీ నుండి ఫ్యాక్టరీలో పని చేయడానికి ప్రవేశం లేకుండా సెక్యూరిటీ సిబ్బందితో ఆటంకపర్చారని చెప్పారు.

కమ్యూనిస్టులు బలపడితేనే దేశ పురోగతి

కమ్యూనిస్టులు బలపడితేనే భారతదేశ పురోగతి, అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. పెదనందిపాడు మండలంలోని పాలపర్రులో ఆదివారం పాత బాపట్ల తాలూకా మృతవీరుల స్మారక సభ నిర్వహించారు. ముందుగా జడ్‌పి పాఠశాల నుంచి అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం బడుగు, బలహీనులు సాగించిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు.

మళ్లీ చింతమనేని హల్‌చల్‌

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొల్లేరు అభయారణ్యం నడిబొడ్డున అక్రమంగా రహదారి నిర్మాణం ఈసారి వివాదానికి కారణమైంది. జిల్లా అటవీశాఖ అధికారులు దీనిని అడ్డుకోగా వారిపై ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా మండవల్లి మండలం చింతపాడు నుండి పశ్చిమ గోదావరి జిల్లా యాగనమిల్లి వరకు రహదారి నిర్మాణం చేయడానికి ప్రభాకర్‌ ఇటీవల ప్రయత్నించారు. దీనిని చింతపాడు గ్రామస్తులు అడ్డుకున్నారు. 

రఘువీరా సహా కాంగ్రెస్‌ నేతల అరెస్టు

కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించ తలపెట్టిన వివాదాస్పద రంగారెడ్డి -పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడుగడుగునా అరెస్టులు చేశారు. దీంతో విజయవాడ అలంకార్‌ కూడలి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు రణరంగంలా మారింది. బ్యారేజీ సందర్శనకు అనుమతి లేదంటూ వందలాది మంది పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. 

13 స్మార్ట్ సిటీల జాబితా

స్మార్ట్ సిటీల రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్కు చోటు దక్కింది. 13 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల రెండో జాబితాను మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో లక్నో తొలి స్థానంలో నిలవగా, వరంగల్ 9వ స్థానంలో నిలిచింది.

జాబితాలోని స్మార్ట్ సిటీలు

50 లక్షల మందితో వెట్టిచాకిరి..

రాష్ట్రంలో 65 రకాల ఉత్పత్తి రంగాల్లో 50 లక్షలకుపైగా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుని ఏడాదికి రూ.500 కోట్ల శ్రమను యజమానులు దోచుకుంటు న్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ తెలిపారు. సిఐటియు కర్నూలు జిల్లా 10వ మహాసభలో పాల్గొనేందుకు ఆదోనికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక శాఖ రెండేండ్ల పెరిగే ధరలకను గుణంగా వివిధ సెక్టార్లలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేత నాలు పెంచాలని కోరారు. 15 ఏళ్లుగా కార్మిక శాఖ వేతనాల పెంపుదల జోలికే వెళ్లలేదన్నారు.

జయతో ప్రమాణస్వీకారం చేయించిన రోశయ్య

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమె మరో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మద్రాస్‌ యూనివర్శిటీ సెంటినరీ సమావేశ మందిరంలో రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య జయలలితతో ప్రమాణస్వీకారం చేయించారు. 

Pages

Subscribe to RSS - May