May

చంద్రన్న కాపుభవనాలపై ఆగ్రహం

కాపు భవనాలకు కూడా చంద్రన్న పేరు పెట్టాలన్న నిర్ణయం కలకలం రేపింది. చంద్రన్న కాపుభవనాలు అంటూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై కాపు నేతలు భగ్గుమన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. దీంతో సర్కారులో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నాడు తన నివాసంలో అధికారులతో దీనిపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. 

ఇరాన్‌ చేరుకున్న ప్రధాని మోడీ

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌ రాజధాని టెహరాన్‌ చేరుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇవాళ ఇరాన్‌ అధ్యక్షడు హసన్‌ రౌహనీతో చర్చలు జరుపుతారు. ఆదేశ అగ్రనేత ఆయతుల్లా ఖొమైనీని కూడా మోదీ కలుస్తారు.

స్వరాజ్‌ మైదాన్‌ కనుమరుగు..

సుదీర్ఘ చరిత్ర కలిగిన స్వరాజ్య మైదానం (పిడబ్ల్యుడి) గ్రౌండ్స్‌) రూపు రేఖలు మారిపోనున్నాయి. సిటీ స్క్వేర్‌ పేరుతో మైదానంలో ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. చైనాకు చెందిన జిఐసిసి సంస్థ రూపొందించిన సిటీ స్క్వేర్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ డిజైన్‌కు సిఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.

హోదాపై మౌనం ఎందుకు..?

నాలుగొందల శతాబ్ధాల చరిత్రకలిగిన హైదరాబాద్‌ ఆర్ధిక వివర్తన, అమరావతిలో ఆచరణసాధ్యం కాదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఒంగోలులో జరిగిన అఖిల భారత అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడెందుకు ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ కేటగిరి అవసరంలేదనే వాదన అర్థంలేనిదని అన్నారు.

బాబుకు ముద్రగడ లేఖాస్త్రం

కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమం చేస్తున్న ముద్రగడ మరోసారి సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో పలు ప్రశ్నలు..పలు విమర్శలు గుప్పించారు. కాపులను బీసీలో చేర్చే చర్యలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేద కాపులకు రుణాల మంజూరు గురించి ఆలోచించారా ? అని ప్రశ్నించారు. చంద్రన్న కానుకలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఆస్తి వివరాలు ఇచ్చినట్లుగా పేర్లు ఏంటనీ ప్రశ్నించారు.

ప్రజారోగ్యంలో మేటి క్యూబా

క్యూబాలో ప్రజారోగ్యం అగ్రరాజ్యా లను తలదన్నే విధంగా ఉంది. 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రాధాన్యతల్లో ఆరోగ్యానికి అగ్రస్థానం ఇచ్చింది. రాజ్యాంగంలో ఉన్న 'ఆరోగ్య హక్కు' అక్షరాలా అమలవుతున్నది. ప్రపంచ దేశాలు క్యూబాలోని ప్రజారోగ్యాన్ని ఒక ఆదర్శంగా భావిస్తున్నాయి. క్యూబాలోని ఆరోగ్య వ్యవస్థను శత్రువులైనా, మిత్రులైనా కొనియాడక తప్పడంలేదు. 1.5 కోట్ల జనాభా కలిగిన క్యూబా దేశం ఆరోగ్యంలో గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నది. 1959 క్యూబా విప్లవం జయప్రదం అయినప్పటి నుంచి ''సార్వత్రిక ఆరోగ్య రక్షణ'' ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత పథకంగా సోషలిస్టు క్యూబాలో అమలు జరుగుతున్నది.

సిపియం కేంద్ర కార్యాలయం పై దాడిని ఖండిస్తూ

సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడిని ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేరళలో లెఫ్ట్ పార్టీల విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మతోన్మాదాన్ని ఎదుర్కొంటున్నందుకే బిజెపి దాడులు

దేశ సమగ్రత, సమైక్యతల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సిపిఎంపై కుట్ర చేయటానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి శక్తులు యత్నిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి, ఎబివిపి గూండాలు దాడికి యత్నించటాన్ని నిరసిస్తూ ఆదివారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ బస్‌స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పుణ్యవతి మాట్లాడుతూ పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి జరగటం ప్రధానికి తెలియకుండా జరగే అవకాశం లేదని, మోడీ ప్రోద్భలంతోనే ఇది జరిగిందన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. 

కేరళలో LDF తిరుగులేని ఆధిక్యం

కేరళ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ భారీ తిరుగులేని విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోభాగంగా ఈ నెల 16న జరిగిన 14వ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ 91 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌)47 స్థానాలను గెలుచుకుంది. 

Pages

Subscribe to RSS - May