సిపియం కేంద్రకమిటి సభ్యులు, త్రిపుర రాష్ట్ర మాజీముఖ్యమంత్రి దశరథ్దేవ్ శతజయంతి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండవతేదీ నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి రెండవతేదీన అగర్తలాలోని రవీంద్ర శతవార్షిక భవన్లో జరిగిన సభలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి, సిపియం పొలిట్బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ దశరథ్దేవ్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. 'రాజా దశరథ్' అని గిరిజనులు ముద్దుగా పిలుచుకొనే దశరథ్ దేవ్ ఖోవారు సబ్డివిజన్లోని సుదూర గ్రామమైన అంపురాలో 1916 ఫిబ్రవరి రెండవ తేదీన పేదగిరిజన రైతు కుటుంబంలో జన్మించాడు.