June

చాప కింద నీరులా నియంతృత్వం..

        పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.

బిజెపి దిగజారుడుతనం

కాదేదీ విద్వేషానికి అనర్హం అని గట్టిగా భావించే బిజెపి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సైతం దీనికి వాడుకోవాలని చూడడం జుగుప్సాకరం. యోగా డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఎందుకు పాల్గొన లేదో సమాధానమివ్వాలని బిజెపికి డెప్యుటేషన్‌పై వచ్చిన ఆరెస్సెస్‌ ప్రచారక్‌ రామ్‌ మాధవ్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించడం, ఆయన లేకితనాన్ని బయటపెట్టింది. ఆయన ట్వీట్‌కు మద్దతుగా సంఫ్‌ు పరివార్‌ సైబర్‌ యోధులూ విజృంభించడంతో ఆ వార్త క్షణాల్లో దేశమంతటికీ పాకింది. ఇది నిజమే కాబోలు అని అనుకునేలా ఈ గోబెల్స్‌ ప్రచారం సాగింది.

నూతన మద్యం విధానంపై నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని నిరసిస్తూ మంగళవారం విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మద్యం భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 'నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలి, వద్దు వద్దు మద్యాంధ్రప్రదేశ్‌, మంచినీరు నిల్‌-మద్యం పుల్‌' అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.ముందుగా సిపిఎం నగర కార్యాలయం నుంచి ఆందోళనకారులు ప్రదర్శనగా బీసెంటర్‌ రోడ్డులోని అన్సారీపార్కు వద్దకు చేరుకున్నారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అంబేద్కర్‌ వారసత్వం

మేధావి మరియు సామాజిక విప్లవ కారుడు అయిన డా|| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా మరీ ముఖ్యంగా హిందూ మితవాదులు ఆయనను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆయన చేసిన కృషి, వారసత్వంపై ఒక అంచనా.

ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృ‌తి కోసం ఉద్యమించాలి

కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య గారి శత జయంతి సందర్భంగా ఈరోజు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడమని కోరారు. ఇంతకుముందు భాషా వికాసం గురించి మాట్లాడిన కొత్తపల్లి రవిబాబుగారు నాకో కరపత్రం ఇచ్చారు. మాతృభాష ప్రాధాన్యత గురించి ఛాయారాజ్‌గారు రాసిన మంచి కవిత్వం దానిలో ఉంది. అందులోని చివరి చరణాలు.
''అమ్మా నీ భాష కావాలి.
నిప్పులు చెరగటానికి..
చెమటను జల్లెడ పట్టి సంపదలను తీయడానికి..
తెలుగు పౌరుషాగ్నిని రాజేయడానికి.. మాతృభాష కావాలి..''

భారత్‌ - చైనా

భారత్‌, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్‌ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్‌ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి.

Pages

Subscribe to RSS - June