
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేరళలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేరళలోని రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ భవనం నిర్మించిన కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. సోనియాగాంధీ 2005లో ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం చేశారు. బకాయిలు చెల్లించాలని కన్స్ట్రక్షన్ కంపెనీ లీగల్ నోటీసులు పంపడంతో కేపీసీసీని బకాయిలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. కానీ చెల్లించకపోవడంతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది.