మోదీ గొప్పలు హాస్యాస్పదం:సురవరం

 రెండేళ్లలో అవినీతి రహిత పాలన అందించామని ప్రధానమంత్రి మోదీ గొప్పలు చెప్పుకోవడం హ్యాస్యాస్పదంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యాలు దేశం నుంచి పారిపోయారని... వారిని వెనక్కి రప్పించడంతో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజె, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లపై అవినీతి ఆరోపణలు వస్తే భాజపా ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు.