July

అబ్దుల్ కలాం కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌ కలాం (84) సోమవారం కన్నుమూశారు. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త కూడా అయిన కలామ్‌ మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌లో సోమవారం సాయంత్రం ప్రసంగిస్తూ, 6.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలారు. చికిత్స నిమిత్తం ఆయనను మేఘాలయ రాజధాని నాంగ్రిమ్‌ హిల్స్‌లోని బెథాని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సనిందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈశాన్య ప్రాంత హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఇఐజిఆర్‌ఐహెచ్‌ఎంఎస్‌) నుంచి వైద్యులను బెథాని ఆసుపత్రికి ప్రత్యేకంగా రప్పించారు.

విమ్స్‌ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని, ప్రైవేట్‌పరం చేయరాదని సిపిఐ(యం) ధర్నా

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, దీనిని ప్రైవేట్‌పరం చేయరాదని డిమాండ్‌ చేస్తూ నేడు విశాఖజిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద సిపిఐ(యం) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

వ్యూహాత్మకంగానే వివాదాల పెంపు

హైదరాబాదును తామే అభివృద్ధి చేశామన్న ప్రచార వ్యూహం మానుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా కొట్టిపారేయడం లేదా తెలుగుదేశంపై విమర్శకు పరిమితం కావడం వల్ల తనకు రాజకీయంగా కలిగే ప్రయోజనం ఉండదని చంద్రశేఖర రావు భావిస్తారు. అందువల్ల వాటిని ఖండించడంతో ఆగరు. అనివార్యంగా 'ఆంధ్రోళ్లు' అంటూ పల్లవి జోడిస్తారు. ఆఖరుకు మునిసిపల్‌ సమ్మెను కూడా ఆంధ్రా పార్టీలు నడిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం ఇందుకు పరాకాష్ట.

దేవగౌడ దీక్షకు ఏచూరి మద్దతు

భూ సేకరణ చట్ట సవరణ బిల్లు, రైతు ఆత్మహత్యలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగారు. జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న ధర్నాలో జెడిఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నాయకులు అతనికి మద్దతు నందించారు.. పార్లమెంటులో రైతు ఆత్మహత్యలపై సంపూర్ణమైన చర్చ జరిగేంతవరకు తమ దీక్ష కొనసాగుతుందని పార్టీవర్గాల సమాచారం. రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని, సున్నితమైన అంశంపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతులను కించపరిచేలా ఉన్నాయని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

ఇకపై జపాన్ భాష కూడా..

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

లౌకిక ప్రభుత్వాలకు తగని పని

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న గోదావరి పుష్కరాల శాస్త్రీయత, హేతుబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దగ్గరుండి మరీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. లౌకికవాదానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వాలు చాలా రోజుల ముందు నుంచే పుష్కరాలపై దృష్టి సారించాయి. కొద్దిరోజులుగా పుష్కరాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ రోజువారీ కార్యక్రమాలను విస్మరించడం సహేతుకం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

' మన్‌ కీ బాత్‌ ' మహామాయ

 ప్రజలందరూ తనను దేశ ప్రధానిగా చేశారని, తనలోని సాధారణ మనిషి లక్షణాల వల్ల కొన్నిసార్లు ప్రజల్లో ఒక్కడై పోతానని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు. 60 ఏళ్ళలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తామనడానికి ఎంతో ధైర్యం కావాలని గత నెల 28న ఆకాశవాణి ద్వారా ప్రచారమయ్యే మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమంలో అన్నారు. తనను తానే గొప్పవాడిగా పొగుడుకునే వారికి ఎవరైనా పోటీలు నిర్వహిస్తే ప్రపంచంలో మోడీకి ప్రథమ బహుమతి లభించవచ్చు. మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడుతూ బేటీ బచావో, బేటీ పఢావో (బాలికను కాపాడండి, చదివించండి) అంటూ బాలికలను రక్షించడానికి ప్రచారం చేయలన్నారు.

ఉత్తి మాటలతో విద్యరాదు

రాజమండ్రిలో 2015 జులై 22న జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో మీరు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి పలు నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేశారు. సంతోషం. రాష్ట్ర అభివృద్ధికి విద్యాభివృద్ధి ఎంతో కీలకం. నేడు మన రాష్ట్రంలో అక్షరాస్యత 67.41 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర సగటు కంటే ఆరు జిల్లాలు, దేశ సగటు అక్షరాస్యత (74.04 శాతం) కంటే 12 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో 60 శాతం కూడా లేదు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. సుమారు 60 ఏళ్ళలో సాధించలేనిది నాలుగు సంవత్సరాలలో సాధించడం సాధ్యమా? దానికి తగిన ప్రణాళిక ఏది? నిధులు ఏవి?

ఒక తప్పును కప్పిపుచ్చడానికి...

 తప్పు జరిగినప్పుడు ఒప్పుకుంటే ఆ ఒక్క తప్పుకే పరిమితం కావొచ్చు. అదే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకొంటే మాత్రం తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రప్రభుత్వం ఆ రెండవ పనిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నది. గోదావరి పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులు-అన్నీ తానై పుష్కర ఏర్పాట్లు చూసిన సిఎం, ఆయన మంత్రివర్గ అనుచరులు కాదట! వి.వి.ఐ.పిలు, వి.ఐ.పిల సేవలో తరిస్తూ ప్రజా భద్రతను, బాధ్యతను గాలికి వదిలిన అధికారులూ కాదట! పుష్కర ఘాట్‌లో వ్యాపించిన ఒకానొక వదంతి కారణంగా ఆ ఘోరం జరిగిందట.

Pages

Subscribe to RSS - July