July

సిపిఎం మ‌ధు అరెస్టు‌..

కృష్ణాజిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మధు మాట్లాడుతుండగా పోలీసులు మైక్‌ లాక్కొని...ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు, సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJPఅప్పుడు అలా..ఇప్పుడు ఇలా

 పార్లమెంట్‌ను స్తంభింపచేయటం తప్పుకాదనీ, మంత్రుల అవినీతిపై చర్చ జరిగితే ప్రభుత్వం బయటపడిపోతుందే తప్పించి ఒదిగేదేమీ ఉండదని గతంలో వాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు బాణి మార్చి ప్రతిపక్షాలను తప్పుపట్టటం బిజెపి ద్వంద్వనీతికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు విమర్శించారు. యుపిఏ హయాంలో అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న నట్వర్‌సింగ్, పవన్ కుమార్ బన్సల్, అశ్వనీ కుమార్ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే తప్పించి పార్లమెంట్ నడవదని అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా బిజెపి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

మోడీ కోసం ఇడి ప్రయత్నాలు..

మనీ లాండరింగ్‌కి పాల్పడి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీని దేశానికి రప్పించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ప్రయత్నాలు ప్రారంభించింది. లలిత్ మోదీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ముంబయిలోని సెషన్స్ కోర్టును ఈడి కోరింది. లలిత్ మోదీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదైంది. విచారణను తప్పించుకుని మోదీ లండన్ తప్పించుకుపోయాడు. కాగా ఈడి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరుతో జూలై 3న నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా న్యాయస్థాం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

అబ్దుల్ కలాం కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌ కలాం (84) సోమవారం కన్నుమూశారు. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త కూడా అయిన కలామ్‌ మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌లో సోమవారం సాయంత్రం ప్రసంగిస్తూ, 6.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలారు. చికిత్స నిమిత్తం ఆయనను మేఘాలయ రాజధాని నాంగ్రిమ్‌ హిల్స్‌లోని బెథాని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సనిందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈశాన్య ప్రాంత హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఇఐజిఆర్‌ఐహెచ్‌ఎంఎస్‌) నుంచి వైద్యులను బెథాని ఆసుపత్రికి ప్రత్యేకంగా రప్పించారు.

విమ్స్‌ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని, ప్రైవేట్‌పరం చేయరాదని సిపిఐ(యం) ధర్నా

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, దీనిని ప్రైవేట్‌పరం చేయరాదని డిమాండ్‌ చేస్తూ నేడు విశాఖజిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద సిపిఐ(యం) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

వ్యూహాత్మకంగానే వివాదాల పెంపు

హైదరాబాదును తామే అభివృద్ధి చేశామన్న ప్రచార వ్యూహం మానుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా కొట్టిపారేయడం లేదా తెలుగుదేశంపై విమర్శకు పరిమితం కావడం వల్ల తనకు రాజకీయంగా కలిగే ప్రయోజనం ఉండదని చంద్రశేఖర రావు భావిస్తారు. అందువల్ల వాటిని ఖండించడంతో ఆగరు. అనివార్యంగా 'ఆంధ్రోళ్లు' అంటూ పల్లవి జోడిస్తారు. ఆఖరుకు మునిసిపల్‌ సమ్మెను కూడా ఆంధ్రా పార్టీలు నడిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం ఇందుకు పరాకాష్ట.

దేవగౌడ దీక్షకు ఏచూరి మద్దతు

భూ సేకరణ చట్ట సవరణ బిల్లు, రైతు ఆత్మహత్యలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగారు. జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న ధర్నాలో జెడిఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నాయకులు అతనికి మద్దతు నందించారు.. పార్లమెంటులో రైతు ఆత్మహత్యలపై సంపూర్ణమైన చర్చ జరిగేంతవరకు తమ దీక్ష కొనసాగుతుందని పార్టీవర్గాల సమాచారం. రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని, సున్నితమైన అంశంపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతులను కించపరిచేలా ఉన్నాయని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

ఇకపై జపాన్ భాష కూడా..

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

లౌకిక ప్రభుత్వాలకు తగని పని

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న గోదావరి పుష్కరాల శాస్త్రీయత, హేతుబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దగ్గరుండి మరీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. లౌకికవాదానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వాలు చాలా రోజుల ముందు నుంచే పుష్కరాలపై దృష్టి సారించాయి. కొద్దిరోజులుగా పుష్కరాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ రోజువారీ కార్యక్రమాలను విస్మరించడం సహేతుకం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Pages

Subscribe to RSS - July